📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

News Telugu: Pakistan Boat: గుజరాత్ సముద్రంలో పాక్ బోటు.. 11 మంది అరెస్టు

Author Icon By Rajitha
Updated: December 12, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ సముద్రతీరంలో పాకిస్తాన్ (Pakistan) నుండి వచ్చిన ఓ పడవ పట్టుబడటం భారీ కలకలం రేపింది. కచ్‌ తీరంలో గుర్తించిన ఆ పడవలో ఉన్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు అందరూ మత్స్యకారులమని చెబుతున్నా… అనుమానాస్పద ప్రయాణం కారణంగా విచారణను కఠినతరం చేశారు. పట్టుబడిన వ్యక్తులు దారి తప్పి వచ్చామని చెప్పినా, మారు వేషాల్లో దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం జరిగిందేమో అన్న అనుమానం నిఘా వర్గాల్లో కలిగింది. అందుకే వారిని ప్రస్తుతం ప్రత్యేక విచారణకు తరలించారు.

Read also: Chhattisgarh crime: లేడీ డీఎస్పీ లవ్‌ ట్రాప్‌ కలకలం!

A Pakistani boat causes a stir in the Gujarat sea

భారత్‌లో ఉగ్రదాడుల బెదిరింపులు పెరుగుతున్నాయా?

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రచర్యలు కొంత తగ్గినప్పటికీ, ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు ఘటనతో మళ్లీ అలర్ట్ పెరిగింది. దీని తర్వాత పలు ఉగ్రవాదులు పట్టుబడటంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత కట్టుదిట్టమైంది.

బీఎస్ఎఫ్ అధికారుల ప్రకారం
పాకిస్తాన్ ఎల్ఓసీ వెంబడి సుమారు 69 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. జీ బ్రాంచ్ ఇవన్నీ కంటిన్యూగా పరిశీలిస్తోంది. 2025లో ఇప్పటివరకు నాలుగు సార్లు ఎనిమిది మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుని నిర్వీర్యం చేసింది.

పాక్‌లో ఉగ్ర సంస్థల రహస్య సమావేశాలు… భారత్‌పై పెద్ద దాడి ప్లాన్?

భారత నిఘా వర్గాలకు లభించిన తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని ప్రధాన ఉగ్రవాద సంస్థలు భారత్‌పై సమన్వయ దాడుల కోసం రహస్యంగా సమావేశమవుతున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కీలక కమాండర్లు ఇటీవల బహవల్‌పూర్‌లో సమావేశమయ్యారని నమ్ముతున్నారు.

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి బహవల్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనట్లు తెలిసింది. ఈ ప్రాంతం జైష్ అధినేత మసూద్ అజార్ బలమైన స్థావరం. ఇద్దరు కూడా రహస్యంగా సమావేశమయ్యారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BSF GujaratCoast latest news PakistanBoat Telugu News TerrorAlert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.