Telugu News: Pak: పాకిస్తాన్ లో ఉగ్రదాడి ఆరుగురు సైనికులు హతం.. భారీగా ప్రాణనష్టం!

Read Time:  1 min
Pak
Pak
FONT SIZE
GET APP

తానుపెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఆ దేశానికి కీడుగా పరిణమించిన ఘటన ఇది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందిస్తూ, వారికి అన్నివిధాల సౌకర్యాలను కల్పిస్తూ వచ్చిన పాక్ ప్రభుత్వం నేడు వారికి ఉరికొయ్యగా మారింది. ఉగ్రవాదులు (Terrorists) జరిపిన దాడులో ఆరుగురు సైనికులు మరణించారు. పలువురు సామాన్య ప్రజలు కూడా మరణించారు. ఇలా తమ దేశానికే నష్టానికి  కొనితెచ్చుకుంటున్న పాక్ కు బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియదు.

Read also : Gold Rate Updates: తగ్గిన బంగారం, వెండి ధరలు

Pak
Pak Six soldiers killed in terrorist attack in Pakistan.. Heavy casualties!

పాకిస్తాన్ (Pak) లో భారీ ఉగ్రదాడి జరిగింది. ఏకంగా పారామిలటరీ బలగాల ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారనేది తెలియరాలేదు. ప్రాణనష్టం భారీగా ఉండొచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ చీఫ్ డాక్టర్ మియాన్ సయీద్ అహ్మద్ దృవీకరించారు. సంఘటన స్థలాన్ని భద్రత బలగాలు చేరుకున్నాయని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు.

https://twitter.com/Global__persp1/status/1992808988845724080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1992808988845724080%7Ctwgr%5E5a71f5fd947f557c13b309540992de55af26d5cf%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.oneindia.com%2Fnews%2Finternational%2Fgunmen-strike-paramilitary-headquarters-in-peshawar-461625.html

ఆత్మహతి బాంబర్ తో భారీప్రాణనష్టం

పెషావర్ లోని ఫెడరల్ కాన్స్టాబులరీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద ఓ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు తర్వాత కాల్పుల (firing) శబ్దం వినిపించింది. ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని సయీద్ అహ్మద్ తెలిపారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. పేలుడు తర్వాత కాల్పులు జరగడం వల్ల ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చనే ఆందోళన చెందుతున్నారు.

గేటువద్దే నిలిపివేసిన సిబ్బంది.పెషావర్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉందీ పారామిలిటరీ బలగాల ప్రధాన కార్యాలయం. ఆర్మీ కంటోన్మెంట్ కు సమీపంలో కొనసాగుతోంది. గతంలో ఫెడరల్ కాన్స్టిబులరీగా పిలిచేవారు. ఈ మధ్యకాలంలోనే పారామిలటరీ ఫోర్స్ గా పేరు మార్చిందక్కడి ప్రభుత్వం. ఈ ఉదయం 9 నుంచి 9:30 గంటల ప్రాంతంలో ఆత్మాహుతి దాడి సంభవించింది. ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.