📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Pak : పాక్ విషయంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో రూబియో, భారత్‌కు సంయమనం పాటించాలని సూచించారు. పరిణామాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఆశయమని తెలిపారు.

ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు

జైశంకర్ ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. భారత్ ఇప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. దేశ భద్రతకోసం తగిన చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పాక్‌ నుంచి రెచ్చగొట్టే చర్యలు వస్తున్నా, భారత్ స్పందన బాధ్యతాయుతంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు లభించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత దాడులను ఆపితే మీము ఆపుతాం

ఇకపోతే రూబియో అంతకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు. భారత దాడులను భారత్ ఆపితే, తామూ దాడులు ఆపుతామని పాక్ తరఫున వెల్లడించారు. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి మినహాయింపు లేకుండా దాడులు కొనసాగించాలన్న నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎలా పరిణమిస్తాయో అనే అంశంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

Google News in Telugu India -Pakistan War Jaishankar Jaishankar comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.