📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Rajnath : గట్టి బదులు చెబుతాం

Author Icon By Digital
Updated: April 24, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమని, దాడికి గట్టి బదులిస్తామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఘటనపై శ్రీనగర్లో భద్రతా చర్యలపై ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనూ రాజ్ నాథ్ పాల్గొననున్నారు.

Rajnath : గట్టి బదులు చెబుతాం

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన: ఉగ్రవాదానికి గట్టి బదులు చెబుతాం

ఇటీవలి దాడి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా భావిస్తున్నారు. గతంలో కూడా పుల్వామా దాడిలో ఒకే విధమైన విధానం అమలులోకి తెచ్చారు. ఉగ్రవాదులు సాధారణ పర్యాటకులపైనే దాడులు జరిపిన కారణంగా ఇది పాక్ ప్రేరేపిత కుట్రగా అనుమానిస్తున్నారు.ఈ దాడి అనంతరం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతను మరింత కఠినంగా చేసింది. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు డ్రోన్, నైట్ విజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరికరాలతో నిఘా పెంచారు. అంతేకాదు, యాత్రలపై కూడా సెక్యూరిటీ ప్రొటోకాల్‌లను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Read More :
Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

Army Action Breaking News in Telugu Indian Defence jammu kashmir Kashmir Violence Pahalgam Attack Pak Conspiracy Paper Telugu News Rajnath Singh Telugu News Telugu News online Telugu News Today Terrorism in India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.