📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు

Author Icon By sumalatha chinthakayala
Updated: December 14, 2024 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024ను కూడామేఘ్​వాల్ ప్రవేశపెట్టనున్నారు.

లోక్​సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలను అసెంబ్లీలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు సహా రెండు ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికల అమలులో ఓ కీలక ముందడుగు పడినట్లు అయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లోక్​సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలపై మాత్రమే కేంద్రం దృష్టి సారించింది. స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధిచి ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.

కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్​ సింగ్​ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. “ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోయినా లేదా మెజారిటీ కోల్పోతే- ఆ రాష్ట్రం, ప్రభుత్వం లేకుండా మిగతా నాలుగున్నర సంవత్సరాలు ఉంటుందా? అది ఈ దేశంలో సాధ్యం కాదు. ఇప్పటివరకు ప్రభుత్వాలు తమ ఐదేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు రెండున్నరేళ్లకు, కొన్ని చోట్ల మూడేళ్లకు కూలిపోతాయి. 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు.” అని సింగ్ అన్నారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ- జేపీసీకి పంపించాలని మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Arjun Ram Meghwal Jamili Elections Lok Sabha One Nation One Election Bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.