📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Om Birla : ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్‌ ఓం బిర్లా..

Author Icon By Sudha
Updated: December 19, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఇవాళ ఉభ‌య‌స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. చివ‌రి రోజు స‌భ‌కు ప్రధాని మోదీ హాజ‌ర‌య్యారు. ఇక ఉభయసభలు నిరవధిక వాయిదా అనంతరం ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) తేనీటి విందు ఇచ్చారు. పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్‌లో లోక్‌సభ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, ప్రియాంకా గాంధీ, పలువురు అఖిలపక్ష ఎంపీలు హాజరయ్యారు. వీబీ జీ రామ్ జీ బిల్లుకు వ్య‌తిరేకంగా లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యానికి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా (Om Birla) స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. చివ‌రి రోజు స‌భ‌కు ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌య్యారు. మ‌న్రేగా స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం జీ రామ్ జీ బిల్లును తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ బిల్లును వ్య‌తిరేకిస్తూ గురువారం విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. బిల్లు ప్ర‌తుల‌ను చింపి, నినాదాలు చేశాయి. మూజువాణి ఓటు ద్వారా రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు పాసైంది.

Read Also : Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య

Om Birla

రాజ్య‌స‌భ‌ను కూడా ఇవాళ నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ 269వ రాజ్య‌స‌భ స‌మావేశాలు ముగిసిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న‌ను రాజ్య‌స‌భ చైర్మెన్‌గా ఎంపిక చేసినందుకు స‌భ్యుల‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. సభా కార్య‌క్ర‌మాలు జ‌రిగిన తీరు ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. మునుముందు కూడా ఇలాగే స‌భ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. జీరో అవ‌ర్‌, క్వ‌శ్చ‌న్ అవ‌ర్ చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా జ‌రిగిన‌ట్లు సీపీ రాధాకృష్ణ‌న్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Parliament latest news Lok Sabha Speaker MPs tea party Om Birla Speaker Om Birla Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.