Odisha crime news : ఒడిశా రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జగత్సింగ్పూర్ జిల్లాలో 23 ఏళ్ల యువతి ఒకే రోజులో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో దారుణానికి గురై చివరకు హత్యకు గురైంది. నిందితుల్లో ఒకరు ఆమె ప్రియుడు కాగా, మరొకరు సహాయం చేస్తానని నమ్మించిన అపరిచితుడు. ఈ ఘటనలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 22న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆలయానికి రమ్మని ఆమె ప్రియుడు పిలిచాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, రహమా బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ నిస్సహాయంగా ఉన్న యువతిని గమనించిన జార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి సహాయం చేస్తానని చెప్పి పారాదీప్కు తీసుకెళ్లాడు. అయితే అతడు ఆమెను తన అద్దె ఇంటి నాలుగో అంతస్తుపైకి తీసుకెళ్లి మరోసారి అత్యాచారానికి పాల్పడి, అనంతరం భవనం పై నుంచి తోసేయడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం

యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు మృతదేహం లభించడంతో కేసు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అత్యాచారం, హత్య కేసులుగా మార్చి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: