Odisha hospital fire : ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో రోగులను కాపాడే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర కలకలం నెలకొంది.
తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదం
తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, రోగులు గాఢనిద్రలో ఉన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఉన్న ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి భీభత్సంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే ఐసీయూలో ఉన్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు.
Read also: Janasena 13th Formation Day: జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
రోగులను తరలిస్తుండగా మృతి
సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపిన వివరాల (Odisha hospital fire) ప్రకారం మొత్తం 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. అయితే వీరిలో ఏడుగురు రోగులు వార్డులు మారుస్తున్న సమయంలోనే పరిస్థితి విషమించి మృతి చెందారు.
మరో ముగ్గురు రోగులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన ఆసుపత్రి సిబ్బంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఘటన జరిగిన వెంటనే సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: