Odisha: పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు

Read Time:  1 min
Odisha: పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు
FONT SIZE
GET APP

ఒడిశా (Odisha) లోని జాజ్‌పూర్ జిల్లాలో చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జఖాపురా స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, భద్రక్ నుంచి రెస్క్యూ టీమ్‌ను ప్రమాద స్థలానికి పంపించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Read Also: Tamil Nadu: పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

Odisha: Chennai Express derails
Odisha: Chennai Express derails

పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి

క్షేత్రస్థాయిలో రైల్వే అధికారులు కార్యకలాపాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోన్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లను సమీప స్టేషన్లల్లో నిలిపివేశారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ట్రాక్‌లను క్లియర్ చేసి, రైళ్ల రాకపోకలను శరవేగంగా పునరుద్ధరించడానికి ఇంజినీరింగ్ బృందాలను మోహరించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.