ఒడిశా (Odisha) లోని జాజ్పూర్ జిల్లాలో చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జఖాపురా స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, భద్రక్ నుంచి రెస్క్యూ టీమ్ను ప్రమాద స్థలానికి పంపించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
Read Also: Tamil Nadu: పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి
క్షేత్రస్థాయిలో రైల్వే అధికారులు కార్యకలాపాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోన్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లను సమీప స్టేషన్లల్లో నిలిపివేశారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ట్రాక్లను క్లియర్ చేసి, రైళ్ల రాకపోకలను శరవేగంగా పునరుద్ధరించడానికి ఇంజినీరింగ్ బృందాలను మోహరించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: