Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

Read Time:  1 min
Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు
FONT SIZE
GET APP

ఒడిశా (Odisha) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐదు రూపాయల విలువైన స్నాక్స్ ప్యాకెట్‌లో ఉచితంగా ఇచ్చిన చిన్న బొమ్మ బాలుడి జీవితాన్నే అంధకారంలోకి నెట్టింది. ఆ బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడు, కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఈ విషాద ఘటన బలాంగీర్ జిల్లాలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… బాధితుడైన బాలుడు స్థానిక దుకాణంలో ‘లైట్ హౌస్’ అనే బ్రాండ్‌కు చెందిన కార్న్ పఫ్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు.

Read also: Karur stampede: నటుడు విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

పోలీసులకు ఫిర్యాదు

స్నాక్స్ తిన్న తర్వాత, అందులో వచ్చిన చిన్న బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆ బొమ్మ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ప్రభావంతో బాలుడి కంటి గుడ్డు పగిలిపోయింది.కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి, ఆ కంటికి చూపు తిరిగి రాదని నిర్ధారించారు.

Odisha: A boy lost his eyesight after a toy inside a snack packet exploded
Odisha: A boy lost his eyesight after a toy inside a snack packet exploded

ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత స్నాక్ తయారీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ఉత్పత్తిని మార్కెట్ నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడికి తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు.ఇలాంటి ఉత్పత్తుల భద్రతపై కఠినమైన నియంత్రణలు, తనిఖీలు అవసరమని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.