📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

సీఎం బంగ్లాలో క్షుద్రపూజల కలకలం

Author Icon By Sharanya
Updated: February 5, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్ష’ లో క్షుద్రపూజలు జరిగాయంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పదవిలో తానే కొనసాగాలనే ఆకాంక్షతో మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే ఈ పూజలు నిర్వహించారని అన్నారు. ఇందులో భాగంగా దున్నపోతులను బలిచ్చి వాటి కొమ్ములను బంగ్లా ఆవరణలో పాతిపెట్టించారని అన్నారు. సీఎం సీటు తనకే దక్కాలని, వేరే వ్యక్తి ఆ సీటులో ఎక్కువ కాలం కొనసాగ వద్దనే ఉద్దేశంతో షిండే ఈ పని చేశారని ఆరోపించారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలోకి మారడానికి ఇష్టపడడంలేదని సంజయ్ చెప్పారు. గతేడాది డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటి వరకు అధికారిక బంగ్లాలోకి మారలేదు. ఇప్పటికీ సాగర్ బంగ్లాలో నుంచే విధులు నిర్వహిస్తున్నారు.సంజయ్ రౌత్ ఆరోపణలపై తాజాగా సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. క్షుద్రపూజల ఆరోపణలను కొట్టిపారేశారు. తన కూతురు ప్రస్తుతం పదో తరగతి చదువుతోందని, త్వరలో పరీక్షలు ఉండడంతో అధికారిక బంగ్లాలోకి మారేందుకు సమయం తీసుకుంటున్నానని చెప్పారు. కూతురి పరీక్షలు పూర్తయ్యాక వర్ష లోకి షిఫ్ట్ అవుతామని వివరించారు.

ప్రస్తుతం అధికారిక నివాసంలో షిండే ఉన్నారని, అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నాయని ఫడ్నవీస్ గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందిస్తూ.. క్షుద్ర పూజలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న వారికి ఇలాంటి వ్యవహారాలలో బాగా అనుభవం ఉండి ఉండొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

#telugu News Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu maharastra cm Paper Telugu News Politics Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.