పంజాబ్లోని జలంధర్ సమీపంలో జరిగిన హిట్-అండ్-రన్ ప్రమాదంలో ప్రపంచ ప్రఖ్యాత మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (Marathon runner Fauja Singh) మృతిచెందారు. ‘టర్బన్డ్ టొర్నాడో’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన వయస్సు 100 సంవత్సరాలు. అయినా ఆయనే నడకలో చూపిన పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తి.ఫౌజా సింగ్ తన రొజూ చేసే వాకింగ్ సాధనలో పాల్గొనుతుండగా, వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా ఢీకొంది. జలంధర్ శివారులోని రహదారిపై జరిగిన ఈ ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ ఆగకుండా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఫౌజా సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

ఆసుపత్రికి తరలించేలోపే మరణం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫౌజా సింగ్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్టు నిర్ధారించారు. ఈ వార్త విని అభిమానులు, స్పోర్ట్స్ ప్రేమికులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.పోలీసులు ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్షసాక్షుల ద్వారా నిందితుడిని గుర్తించారు. 30 ఏళ్ల ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్ట్ (Police arrest NRI) చేశారు. ఇటీవలే విదేశాల నుంచి పంజాబ్కు వచ్చినట్టు సమాచారం. అతడిపై హిట్-అండ్-రన్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
ఫౌజా సింగ్ – స్ఫూర్తిదాయక మారథాన్ లెజెండ్
ఫౌజా సింగ్ జీవితమే ఒక అద్భుతం. వందేళ్ల వయసులోనూ మారథాన్లలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఎంతో మందికి మోటివేషన్గా నిలిచారు. ఆయన జీవన శైలి, ఫిట్నెస్ పట్ల ఉన్న నిబద్ధత యువతకు మార్గదర్శకంగా నిలిచింది.ఫౌజా సింగ్ మరణ వార్త వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ వచ్చింది. అభిమానులు, ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు. పంజాబ్ ప్రజలు ఆయన కోల్పోవడాన్ని తీరని లోటుగా భావిస్తున్నారు.
Read Also : King Charles : కింగ్ ఛార్లెస్ ప్రశ్న.. శుభ్మన్ గిల్ ఏం చెప్పాడంటే..