భారత్ (India) మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. చమురు (Oil) విషయంలో తమ ప్రయోజనాలే ముఖ్యం అని తేల్చింది. ఎక్కడ ఉత్తమ ధర దొరికితే, అక్కడినుంచే చమురు తీసుకుంటామని చెప్పింది.అమెరికా నుంచి రష్యా చమురు కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు ఇస్తోందని ఆరోపించారు. కానీ భారత్ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది.రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. 140 కోట్ల జనాభాకు ఇంధన భద్రత ఇవ్వడం మా బాధ్యత, అని అన్నారు.భారత చమురు కంపెనీలు వ్యాపార ప్రమాణాలపై పనిచేస్తాయని చెప్పారు. “ఎక్కడ మంచి ధర దొరికితే, అక్కడి నుంచే కొనుగోలు జరుగుతుంది, అని వివరించారు.(Vaartha live news :India)
అంతర్జాతీయ మార్కెట్కు భారత్ స్థిరత
వినయ్ కుమార్ పేర్కొన్న మరో అంశం ఆసక్తికరం. భారత్ చేసే చమురు వాణిజ్యం ప్రపంచ మార్కెట్కి స్థిరతను ఇస్తోంది, అని అన్నారు.అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని భారత్ అభిప్రాయపడింది. అవసరమైతే అన్ని చర్యలు తీసుకుంటామని రాయబారి స్పష్టం చేశారు.కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని గుర్తు చేశారు. “ఇది అందరికీ వర్తించాలి,” అన్నది ఆయన అభిప్రాయం.
జైశంకర్ ఘాటుగా స్పందించిన వ్యాఖ్యలు
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా శనివారం స్పందించారు. మీకు శుద్ధి చేసిన చమురు వద్దంటే, కొనకండి, అని అన్నారు. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు, అని ఆయన అన్నారు.భారత్ తన ఇంధన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇది స్పష్టమైన సిగ్నల్ అని పరిగణించవచ్చు.
Read Also :