📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Budget 2026: బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

Author Icon By Vanipushpa
Updated: January 12, 2026 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను పార్లమెంట్​లో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, గణాంకాల గారడీలతో సరిపెట్టుకుంటుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా బడ్జెట్​ను ప్రతిపాదించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం జీడీపీ అంకెలు గొప్పగా చూపిస్తే సరిపోదన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పన, సామాన్యుడి పొదుపు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం గణాంకాలతో ఆర్థిక వ్యవస్థ అంతా బాగుందనే భ్రమను కల్పిస్తోందని, ఈ బడ్జెట్‌తోనైనా ఆ అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు.

Read Also: imachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

మరో ఇరవై రోజుల్లో బడ్జెట్‌

2026-27 బడ్జెట్‌ను మరో ఇరవై రోజుల్లో పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుందని, ఇదే సమయంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఈ బడ్జెట్ కచ్చితంగా ప్రతిబింబిస్తుందని రమేష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల( 2026-27 నుంచి 2031-32) కాలానికి సంబంధించిన ఈ సిఫార్సులు కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీ, రాష్ట్రాల మధ్య ఆ నిధుల కేటాయింపుకు నిర్దేశిస్తాయన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ బలవంతంగా తీసుకొచ్చిన 60:40 వ్యయ విధానంతో రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.

Budget 2026: బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

దేశంలో సంపద, ఆదాయం, వినియోగంలో అసమానతలు


భారత ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు సమస్యలు పట్టి పీడిస్తున్నాయని జైరాం రమేశ్ విశ్లేషించారు. “కార్పొరేట్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. అవి భారీగా లాభాలు గడిస్తున్నాయి. అయినా సరే, అవి తిరిగి కొత్త పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం లేదు. పెట్టుబడులు రాకపోతే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? దేశంలో గృహ పొదుపు రేట్లు గణనీయంగా పడిపోయాయి. మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బు నిలవడం లేదు. ఇది దేశ పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. దేశంలో సంపద, ఆదాయం, వినియోగంలో అసమానతలు అంతకంతకూ లోతుగా మారుతున్నాయి. ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఈ అగాధాన్ని పూడ్చకపోతే ప్రమాదం తప్పదు” అని అన్నారు. కేవలం జీడీపీ వృద్ధి రేటును చూసి మురిసిపోవద్దని కాంగ్రెస్ నేత హితవు పలికారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Budget Analysis Budget Criticism economic policy Finance Minister Fiscal Responsibility Indian Budget Indian Economy Jairam Ramesh Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.