Latest News: Doctors Prescription: వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Read Time:  1 min
Latest News: Doctors Prescription: వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు
FONT SIZE
GET APP

సాధారణంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్ ఇచ్చే మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) (Doctors Prescription) ఫార్మసిస్ట్లు మాత్రమే చదవగలుగుతారు. కానీ సామాన్య ప్రజలకు, రోగులకు అస్సలు అర్థం కాదు. దీంతో తాము వాడాల్సిన మందుల వివరాలు, మోతాదు గురించి రోగులకు స్పష్టమైన అవగాహన ఉండడం లేదు.

Read Also:  Supreme Court: NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు

అనేక సందర్భాలలో.. ఈ అస్పష్టమైన రాత కారణంగా రోగులు మందులను తప్పుగా అర్థం చేసుకునే లేదా దుకాణదారుల ద్వారా పొరపాట్లు జరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, జాతీయ వైద్య కమిషన్ (NMC) కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై దేశంలోని వైద్యులంతా మందుల చీటీలపై స్పష్టంగా, చదవగలిగే విధంగా రాయాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ (Doctors Prescription) అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.

Doctors Prescription: NMC key orders on doctors' prescriptions
Doctors Prescription: NMC key orders on doctors’ prescriptions

నివేదికలను తమకు సమర్పించాలని ఎన్ఎంసీ పేర్కొంది

ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వైద్యులు మందులు రాసే పద్ధతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీ నివేదికలను డీటీసీ సమావేశ మినిట్స్‌లో నమోదు చేయాలని, అవసరమైనప్పుడు ఆ నివేదికలను తమకు సమర్పించాలని ఎన్ఎంసీ పేర్కొంది.

మందుల చీటీలో చేతిరాత స్పష్టంగా ఉండటంతో పాటు వీలైతే క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలని తెలిపింది. అలాగే మందులను వాటి జనరిక్ పేర్లతోనే రాయడం, అనవసరమైన మందులు సూచించకుండా హేతుబద్ధత పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేసి, అమలు చేయాలని అన్ని వైద్య కళాశాలలను ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.