Amit Shah: బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి వీడ్కోలు పలికి, కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ పాలనను బిహార్ చరిత్రలోనే ఒక ‘సువర్ణ అధ్యాయం’గా ఆయన అభివర్ణించారు. 2005 నుంచి ఇప్పటి వరకు నితీశ్ అందించిన సేవలు రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశాయని అమిత్ షా కొనియాడారు.
Read Also: Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మోదీ మౌనంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజ్యసభకు స్వాగతం
నితీశ్ కుమార్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల పాటు సీఎంగా ఉండి కూడా నితీశ్ పై ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం గొప్ప విషయమని, ఆయన నిష్కళంకమైన సేవలు అందించారని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధి పథంలో నిలబడటంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, నితీశ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బిహార్ రూపురేఖలను మార్చివేసిందని అమిత్ షా గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తిరిగి రాజ్యసభకు వస్తున్నారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: