📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Nitish Kumar : ప‌దోసారి సీఎం కాబోతున్న నితీశ్‌కుమార్‌ !

Author Icon By Sudha
Updated: November 19, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) ప‌దోసారి బీహార్ ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే తొమ్మిది సార్లు ముఖ్య‌మంత్రిగా చేసిన నితీశ్‌కుమార్‌ను ఇవాళ జ‌రిగిన ఎన్డీయే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో కూట‌మి ఎమ్మెల్యేలంతా క‌లిసి త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు.దాంతో బీహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన‌ నితీశ్‌కుమార్ (Nitish Kumar)మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు నితీశ్ రేపు పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయ‌న‌తోపాటు ప‌లువురు మంత్రులుగా కూడా ప్ర‌మాణం చేయ‌నున్నారు.

Read Also : http://Indira Gandhi: ఆమె ఓ అసమానత వనిత .. కాంగ్రెస్

Nitish Kumar

కూట‌మి స‌ర్కారులో జేడీయూ, బీజేపీతోపాటు న‌లుగురైదుగురు ఎల్‌జేపీ ఎమ్మెల్యేల‌కు కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఉంది. కాగా ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ ప్ర‌ధాన పార్టీలుగా గ‌ల ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 243 స్థానాల‌కుగాను ఏకంగా 202 స్థానాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ప్ర‌తిప‌క్ష మ‌హాగ‌ఠ్‌బంధ‌న్ 41 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. అందులో ఆర్జేడీకి 25, కాంగ్రెస్‌కు 5 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి.

నితీష్ కుమార్ యాదవ్ ఎవరు?

నితీష్ కుమార్ (జననం 1951 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bihar Politics Breaking News Chief Minister Indian Politics JD(U) latest news Nitish Kumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.