Latest Telugu News: Bihar: మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన నితీష్ కుమార్ .. వీడియో వైరల్

Read Time:  1 min
మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన నితీష్ కుమార్ .. వీడియో వైరల్
మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన నితీష్ కుమార్ .. వీడియో వైరల్
FONT SIZE
GET APP

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో సీఎం నితీశ్ ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్యంపై గత కొన్నాళ్లుగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వాడనలకు బలం చేకూరుస్తూ ముజఫర్‌పూర్‌ ఎన్నికల ర్యాలీలో సీఎం వ్యవహరించిన తీరుపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి రమా నిషాద్‌ను సన్మానించడానికి బదులుగా, ఆమె మెడలో పూలమాల వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తారు. “ఆయన నిజంగా వింతైన వ్యక్తి. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే, రాసిన నోట్‌లోని ప్రసంగాన్ని ఎందుకు చదువుతున్నారు? ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?” అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.

Read Also: UPI payments : ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్‌!

మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన నితీష్ కుమార్ .. వీడియో వైరల్
మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన నితీష్ కుమార్ .. వీడియో వైరల్

సోషల్ మీడియాలో తన నిరాశను వ్యక్తం చేసిన మాజీ మంత్రి రామ్‌సూరత్ రాయ్

మాజీ ఎంపీ పప్పు యాదవ్ ఈ సంఘటనపై భిన్నంగా స్పందించారు. “మనం కూతుళ్లకు దండలు వేయకూడదా.. దేవతలకు దండలు వేయకూడదా..? దీన్ని ఎందుకు సమస్యగా చేస్తున్నారు? నితీష్ కుమార్ అలా చేస్తుంటే సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఔరాయ్ అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌సురత్ రాయ్‌కు టికెట్ నిరాకరించి.. మాజీ ఎంపీ అజయ్ నిషాద్ భార్య రమా నిషాద్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రాయ్ స్థానంలో శక్తివంతమైన నిషాద్ రాజకీయ కుటుంబం నుండి వచ్చిన రమా నిషాద్‌ను నిలబెట్టడం గమనార్హం. టికెట్ నిరాకరణతో అసంతృప్తి చెందిన మాజీ మంత్రి రామ్‌సూరత్ రాయ్ సోషల్ మీడియాలో తన నిరాశను వ్యక్తం చేశారు.

శక్తివంతమైన రాజకీయ కుటుంబం
రమా నిషాద్ రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చారు. ఆమె భర్త అజయ్ నిషాద్ ముజఫర్‌పూర్ మాజీ ఎంపీ. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించబడడంతో గత సంవత్సరం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన అజయ్ నిషాద్ పరాజయం తరువాత తిరిగి బిజెపి గూటికి చేరారు. రమా నిషాద్ మామ కెప్టెన్ జై నారాయణ్ ప్రసాద్ నిషాద్.. బీహార్ రాజకీయాల్లో సుపరిచితులు. ఆయన నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం, అజయ్ నిషాద్ బీజేపీ టికెట్‌పై రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు.

పాట్నా నివసించడానికి మంచి ప్రదేశం?

స్తరిస్తున్న మౌలిక సదుపాయాలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వంతో, పాట్నా భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల కంటే గణనీయంగా తక్కువ జీవన వ్యయాన్ని అందిస్తుంది . ఈ నగరం కుటుంబాలు, నిపుణులు మరియు విద్యార్థులకు సమానంగా వసతి కల్పిస్తుంది, సరసమైన గృహనిర్మాణం, ఆర్థిక రవాణా మరియు సహేతుక ధరలకు అవసరమైన వస్తువులను అందిస్తుంది.

పాట్నా డీఎం ఎవరు?

ముఖ్యమంత్రి సచివాలయ కార్యదర్శిగా చంద్రశేఖర్ సింగ్ నియామకం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.