📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Nitish Kumar : ఉచిత విద్యుత్‌.. ఎన్నికల వేళ బీహార్‌ సీఎం కీలక ప్రకటన

Author Icon By Sudha
Updated: July 17, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఓ కీలక వసతి ప్రకటించారు – జూలై 17, 2025న ప్రకటించిన ఈ పథకం ప్రకారం, రాష్ట్రంలోని అందరు గృహ వినియోగదారులకు ఆగస్టు 1, 2025 నుంచి ప్రతి నెల మొదటి 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా (free electricity) అందించబడుతుంది. బీహార్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు, పింఛన్లు వంటి కీలక హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)మరో కీలక పథకాన్ని ప్రకటించారు.

Nitish Kumar : ఉచిత విద్యుత్‌.. ఎన్నికల వేళ బీహార్‌ సీఎం కీలక ప్రకటన

1.67 కోట్ల కుటుంబాలకు

125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకూ ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ లెక్కన జులై నెల కరెంటు బిల్లు సైతం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం వెల్లడించారు.

నితీష్ కుమార్ అర్హతలు?

నితీష్ కుమార్ 1972లో బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఇప్పుడు NIT పాట్నా) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఆయన బీహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో అర్ధమనస్కంగా చేరి, తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన 1973 ఫిబ్రవరి 22న మంజు కుమారి సిన్హా (1955–2007)ను వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

బీహార్ నెట్ వర్త్?

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలలో బీహార్ ఒకటి మరియు ఇది ఎక్కువగా సేవల ఆధారితమైనది, అయితే వ్యవసాయం మరియు పరిశ్రమలు కూడా గణనీయంగా దోహదపడతాయి. ప్రస్తుత ధరల ప్రకారం, 2025–26లో రాష్ట్ర GDP ₹1,097,264 కోట్లు (US$130 బిలియన్) (US$130 బిలియన్)గా అంచనా వేయబడింది. $130.1 బిలియన్ (నామమాత్రం; 2025 అంచనా)

బీహార్ లో అత్యంత ధనిక కులం?

16వ శతాబ్దం నాటికి, భూమిహార్లు తూర్పు భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర బీహార్‌లో విస్తారమైన భూభాగాలను నియంత్రించారు. పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి, బిహారీ రాజ్‌పుత్‌లతో కలిసి, వారు ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ భూస్వాములుగా స్థిరపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Parliament Sessions : కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ వ్యూహం!

125 units free power Bihar Bihar Elections Breaking News free electricity latest news Nitish Kumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.