వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గడ్కరీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ వాతావరణ పరిస్థితులు గత కొంతకాలంగా రోజురోజుకీ మరింత దారుణంగా మారుతున్నాయి. వర్షాలు తక్కువగా పడటం, వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ కార్యకలాపాలు తదితర కారణాల వల్ల ఢిల్లీ వాయు కాలుష్యం (Delhi air pollution) అత్యధిక స్థాయికి చేరుకుంది. నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ,కాలుష్య స్థాయిల కారణంగా తాను ఇప్పుడు ఢిల్లీలో కేవలం రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండేందుకు ఇష్టపడుతున్నానని చెప్పారు. అంతకు మించి అస్సలే ఉండలేకపోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీకి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసినప్పుడే రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టే ఢిల్లీలో ఏ స్థాయిలో కాలుష్యం ఉందో అర్థం చేసుకోవాలని, కాలుష్యం ప్రజల ఆరోగ్యం, ఆయుష్షుపై ఎంత హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని గుర్తుంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
తాను ముందే రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుంటానని
ఏక్ పెడ్ మా కే నామ్ 2.0′ పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ (Nitin Gadkari) ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఢిల్లీలో ఉంటానని, ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఆలోచిస్తుంటానని చెప్పారు. తాను ముందే రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుంటానని కూడా పేర్కొన్నారు. ప్రజలు ఈ సమస్యలను తీవ్రంగా పరిగణించాలని, ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం చాలా వరకు తగ్గిందని వెల్లడించారు.నితిన్ గడ్కరీ, ఢిల్లీ కాలుష్య సమస్యను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.శిలాజ ఇంధనాల నుంచి వెలువడే వాహన ఉద్గారాలను తగ్గించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ఇంధన కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ
కాలుష్య సమస్యను పరిష్కరించడం అనేది కేవలం ప్రభుత్వానికో లేదా ఒక విభాగానికో సంబంధించినది కాదని, ఇందులో ప్రజలందరి భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. నాగ్పూర్ ఎంపీ కూడా అయిన గడ్కరీ, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఇంధన కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్ (Ethanol) వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో వ్యర్థాలను కూడా ఉపయోగిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 80 లక్షల టన్నుల వ్యర్థాలను రోడ్డు ప్రాజెక్టులలో వాడినట్లు పేర్కొన్నారు.అలాగే, జాతీయ రహదారులపై భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
జాతీయ రహదారులపై వర్షపు నీటిని
జాతీయ రహదారుల సంస్థ (NHAI) కూడా కాలుష్య నివారణకు గణనీయమైన కృషి చేస్తోందని గడ్కరీ వెల్లడించారు. గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేయడంలో NHAI చురుకుగా పని చేస్తోందని, 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి దాదాపు 67 లక్షల మొక్కలను నాటిందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, జాతీయ రహదారులపై వర్షపు నీటిని సంరక్షించే చర్యల (రెయిన్వాటర్ హార్వెస్టింగ్) ద్వారా నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ (Delhi) లో పెరిగిపోతున్న కాలుష్యం పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలి. లేకపోతే మన ఆరోగ్య భద్రతే కాదు, మన భవిష్యత్తూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
నితిన్ గడ్కరీ విద్యాభ్యాసం ఏమిటి?
B.Com (బాచిలర్ ఆఫ్ కామర్స్) నాగర్పూర్ విశ్వవిద్యాలయం నుండి.M.Com (పోస్ట్‑గ్రాడ్యుయెట్) అలాగే LL.B (బ్యాచిలర్ ఆఫ్ లా) కూడా నాగర్పూర్ విశ్వవిద్యాలయం నుండి.బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లోమా పూర్తి చేసారు .
ఆయన రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?
విద్యార్థి సంస్థ కొన్ని ఏడేళ్ల నుండి తనను RSS‑ABVP‑BJYM తో అనుసంధానంగా పాపులర్ చేశారు.1989లో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కీ ఎంపికయ్యారు .
Read hindi news: hindi.vaartha.com