📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

Nitin Gadkari : ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్‌ గడ్కరీ

Author Icon By Sudha
Updated: December 24, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడు రోజులు ఢిల్లీలో ఉంటే.. కాలుష్యం కారణంగా అలర్జీలు వచ్చాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ (Nitin Gadkari)పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణమని అంగీకరించారు. ‘నేను రవాణా శాఖ మంత్రిని. 40 శాతం కాలుష్యానికి రవాణా రంగమే కారణం’ అని తెలిపారు. ‘ఇది ఎలాంటి జాతీయ వాదం..? శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కాలుష్యం పెరుగుతోంది. శిలాజ ఇంధన వినియోగాన్ని మనం తగ్గించలేమా..? సున్నా కాలుష్యానికి దారితీసే ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైడ్రోజన్‌ శక్తితో నడిచే వాహనాలను మనం ఎందుకు ప్రోత్సహించలేము..?’ అని నితిన్‌ గడ్కరీ ప్రశ్నించారు. శిలాజ ఇంధనాల్ని దిగుమతి చేసుకోవడానికి ఏటా రూ.22 లక్షల కోట్ల ఖర్చు అవుతోందని.. ఇది ఆర్థిక భారమని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ వాహనాల వైపు మళ్లాలని సూచించారు.

Read Also : http://Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

Nitin Gadkari

కాగా, ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు. ఢిల్లీకి వస్తే.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను ఢిల్లీలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండగలను. అంతకుమించి ఉండటం నావల్ల కాదు. ఢిల్లీలో అడుగుపెట్టగానే ఎప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది. అందుకే నేను వచ్చేటప్పుడే రిటర్న్‌ టికెట్స్‌ కూడా బుక్‌ చేసుకుంటాను. ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం తగ్గింది. వాహనాలకు వినియోగించే శిలాజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత’ అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

air pollution BreakingNews Delhi pollution environment latest news Nitin Gadkari Telugu News transport sector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.