📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తక్కువ టైమ్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మలమ్మ

Author Icon By Vanipushpa
Updated: February 1, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఇప్పటివరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎనిమిదో సారి ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక గంటా 14 నిమిషాల పాటు జరిగింది. అయితే ఈ సారి మాత్రమే ఆమె తక్కువ సమయంలో బడ్జెట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 1 న ఆమె ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కేవలం 56 నిమిషాలు మాత్రమే సాగింది. 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. 2020లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు జరిగింది. సమయం మరీ ఎక్కువ అవుతుండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యధిక సమయం కావడం గమనార్హం.

వేతన జీవులకు వరాలు.. వేతన జీవులకోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు నిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ ధరలపై ఫోకస్.. వంటనూనెలపై దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది.నూనెల ధరలు పేదవాడికి భారంగా మారిన నేపథ్యంలో వంటనూనెల ధరల తగ్గింపునకు ఆరు సంవత్సరాల మిషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Budget Speech finished short time Nirmala Sitaraman parliament budget 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.