Latest Telugu news : Nirmala Sitharaman – ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోంది : నిర్మలాసీతారామన్‌

Read Time:  1 min
Nirmala Sitharaman - ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోంది : నిర్మలాసీతారామన్‌
Nirmala Sitharaman - ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోంది : నిర్మలాసీతారామన్‌
FONT SIZE
GET APP

ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇలాంటి తరుణంలో బయటి నుంచి ఆకస్మికంగా తగిలే షాక్‌లను తట్టుకోవడంతో భారత్ సామర్థ్యం (India’s potential)బలంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌-2025లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) మాట్లాడుతూ.. ఆర్థిక, ఇంధన అసమతుల్యతను ఎదుర్కోవడం కూడా దేశాల ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు తీవ్రమవుతున్నాయని, ఆంక్షలు, సుంకాలు, విభేదాలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి భారత్‌కు కూడా దెబ్బేనని, వీటన్నింటినీ బలంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు.

 Nirmala Sitharaman - ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోంది  : నిర్మలాసీతారామన్‌
Nirmala Sitharaman – ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోంది : నిర్మలాసీతారామన్‌

దేశ ఆర్థిక పరపతి కూడా అభివృద్ధి చెందుతోందని నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman)చెప్పారు. యుద్ధాలు, వ్యూహాత్మక పోటీలు, సంఘర్షణ సరిహద్దులను తిరగ రాస్తున్నాయని అన్నారు. గతంలో బలంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు పరీక్షలు ఎదుర్కొంటున్నాయి, కొత్త సంకీర్ణాలు ఉద్భవిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు. యాదృచ్ఛికంగా భారత్‌ ఈ స్థాయికి రాలేదని, అనేక శక్తిమంతమైన సంస్కరణల ద్వారా వచ్చిందని చెప్పారు.

నిర్మలా సీతారామన్ వ్యక్తిగత జీవితం?

సీతారామన్ తన భర్త, ఆర్థికవేత్త మరియు వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్‌ను జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం నుండి కలిశారు. వారు 1986 లో వివాహం చేసుకున్నారు మరియు గతంలో ది హిందూలో పనిచేసిన మరియు ప్రస్తుతం మింట్ లాంజ్‌లో పనిచేస్తున్న ఒక కుమార్తె ఉంది.

భారతదేశపు మొదటి మహిళా మంత్రి ఎవరు?

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అమృత్ కౌర్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో భాగమయ్యారు; ఆమె క్యాబినెట్ హోదా పొందిన మొదటి మహిళ, పదేళ్లపాటు సేవలందించారు. జనవరి 1949లో, ఆమె డేమ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ (DStJ)గా నియమితులయ్యారు. ఆమెకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.