కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్కు ముందు కీలక సంకేతాలు ఇచ్చారు. దేశీయ(Nirmala Sitharaman) ఆదాయపు పన్ను, వస్తు సేవల పన్ను వ్యవస్థల్లో ఇప్పటికే ప్రభుత్వం సరిచరణలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు దృష్టిని కస్టమ్స్ వ్యవస్థపై కేంద్రీకరించామని ఆమె తెలిపారు. కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా వాణిజ్య ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.
Read also: శ్రీవారికి 122 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన జైన మతస్థుడు

రూపాయి విలువ, జీడీపీ వృద్ధి పరిస్థితులు
నిర్మలా సీతారామన్ వివరాల ప్రకారం, పౌరుల చేతిలో ఎక్కువ నగదు ఉండేలా చూసి, వినియోగాన్ని(Nirmala Sitharaman) పెంచేందుకు ఇప్పటికే ట్యాక్స్ వ్యవస్థలు సరిచేయబడ్డాయని గుర్తు చేశారు. కస్టమ్స్ వ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరం, ప్రజలకు నిబంధనలు భారంగా అనిపించకుండా సరళతరం చేయాలి, పారదర్శకత పెంచాలి అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే గత బడ్జెట్లలో కస్టమ్స్ సుంకాల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం(Government) వచ్చింది. 2023-24లో ఏడు సుంకాల స్లాబ్లను తొలగించగా, ఈ ఏడాది బడ్జెట్లో పారిశ్రామిక వస్తువులపై అదనపు స్లాబ్లను కూడా తొలగించాలని ప్రతిపాదించారు. దీంతో మొత్తం స్లాబ్ల సంఖ్య ఎనిమిదికి తగ్గింది. రూపాయి విలువ, ఆర్థిక వృద్ధి విషయానికొస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని సాధించింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంపై స్పందిస్తూ, త్వరలో రూపాయి సహజ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. అయితే, విదేశీ నిధుల అవుట్ఫ్లో, ముడి చమురు ధరల కారణంగా రూపాయి ఇటీవల చారిత్రక కనిష్టానికి ₹90.21 చేరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: