📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

NH-167 4-lane road: కేంద్రం మరో గ్రీన్ సిగ్నల్

Author Icon By Siva Prasad
Updated: February 14, 2026 • 10:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

NH-167 4-lane road: పాలమూరు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి చిత్తశుద్ధి చాటుకున్నది. నారాయణపేట జిల్లాలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్నగర్ నాలుగు లేన్ల రహదారికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మంజూరు కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.

Read Also: Andhra Pradesh: బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో గూడెబెల్లూర్ నుండి మహబూబ్ నగర్ జాతీయ రహదారి-167ను 4-లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కానుంది.

NH-167 4-lane road: రూ. 3,175 కోట్ల నిధులు మంజూరు

ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,175 కోట్ల నిధులను మంజూరు చేసింది. నిధుల కేటాయింపుతో పాటు పనుల వేగంపై కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ ప్రాజెక్టును రెండు ఏళ్ల లోపు (రెండేళ్లలో) పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ప్రధానికి ఎంపీ డీకే అరుణ ధన్యవాదాలు

జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరుపున ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

3175 Crores Highway Funds DK Aruna Thanks PM Modi Gudebellur Mahabubnagar NH 167 Mahabubnagar Road Project NH-167 4-lane Road Palamuru Highway Development PM Modi Cabinet Approvals Telangana National Highway News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.