TV9 భరత్వర్ష్ నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్ (Second edition of News9 Global Summit) అక్టోబర్ 9-10 తేదీల్లో జర్మనీలోని స్టట్గార్ట్లో జరుగనుంది. ఈ సమ్మిట్ ప్రధానంగా భారత్-జర్మనీ (India-Germany) ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక సహకారం, వాతావరణ చర్య, విద్యా మార్పిడిపై దృష్టి సారించనుంది. “ప్రజాస్వామ్యం, జనాభా, అభివృద్ధి: భారత్-జర్మనీ సంబంధాలు” అనే అంశంపై చర్చలు జరుగుతాయి.జర్మనీ యూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్కు కీలక వ్యూహాత్మక భాగస్వామి. ఈ సమ్మిట్ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని విశ్లేషించేందుకు వేదిక కానుంది. రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికపై చర్చించనున్నారు. వృద్ధి, ప్రపంచ నాయకత్వానికి ఉన్న అవకాశాలను రెండు దేశాలు అన్వేషించనున్నాయి.
టీవీ9 నెట్వర్క్ అభిప్రాయం
టీవీ9 నెట్వర్క్ ఎండీ మరియు సీఈఓ బరుణ్ దాస్ మాట్లాడుతూ, “భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర వృద్ధికి ఆచరణాత్మక పరిష్కారాలను అందించడం సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం” అన్నారు. విభిన్న రంగాల నుండి నిపుణులను ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సమ్మిట్లో పాల్గొనే ప్రముఖులు
ఫ్రాన్హోఫర్లో కీలక నాయకురాలు అయిన ఆనంది అయ్యర్, క్లీన్ టెక్నాలజీ, ఆరోగ్య సాంకేతికత, స్మార్ట్ సిటీలలో అనుభవం కలిగిన నిపుణురాలు. ఆమె భారత్-జర్మనీ విద్యా మార్పిడి, నైపుణ్యాల ఆధారిత కార్యక్రమాలు, డ్యూయల్ డిగ్రీల అవకాశాలపై తన అభిప్రాయాలు పంచుకోనున్నారు.
రాజిందర్ ఎస్. భాటియా
SIDM అధ్యక్షుడు మరియు కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ రాజిందర్ ఎస్. భాటియా “భద్రత, స్థిరత్వం, స్కేలబిలిటీ: రక్షణ రంగాన్ని మార్చడం” అనే సెషన్లో పాల్గొననున్నారు. భారత రక్షణ రంగాన్ని ప్రపంచ భాగస్వామ్యాలతో కలిపి ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని సమర్థించే విధానాలపై ఆయన చర్చించనున్నారు.
డాక్టర్ వివేక్ లాల్
జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ CEO డాక్టర్ వివేక్ లాల్ కూడా సమ్మిట్లో పాల్గొననున్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. అమెరికా, భారత్, యూరప్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. రక్షణ ఆవిష్కరణ, సహ-ఉత్పత్తి, సాంకేతిక బదిలీ, స్థిరమైన అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
కొత్త అవకాశాల వేదిక
ప్రస్తుత ప్రపంచ క్రమం వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత్, జర్మనీలు కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నాయి. స్టట్గార్ట్లో జరిగే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ప్రజాస్వామ్యం, జనాభా, అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, అవకాశాలను చర్చించేందుకు ప్రత్యేకమైన వేదికగా నిలవనుంది.
Read Also :