News Telugu: కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనుంది.

జోన్ల వారీగా పోస్టుల భర్తీ
ఈ నియామకాలు అహ్మదాబాద్ (Ahmedabad), అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము–శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్పూర్, తిరువనంతపురం వంటి ఆర్ఆర్బీ రీజియన్లలో జరగనున్నాయి. ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ విడుదల కాగా, పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వనున్నారు.
అర్హతలు & వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 20 నుండి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు, క్వాలిఫికేషన్ వివరాలు పూర్తి నోటిఫికేషన్లో ఇవ్వబడతాయి.
దరఖాస్తు తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 15, 2025 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 14, 2025 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
వేతన వివరాలు
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు కనీసం ₹35,400 వేతనం లభించనుంది. అదనంగా డీయర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
అధికారిక సమాచారం
జోన్ల వారీ ఖాళీలు, ఎంపిక విధానం, పరీక్ష పద్ధతి వంటి వివరాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.
Read hindi news: hindi.vaartha.com
Read also: