జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం మరోసారి మావోయిస్టు కదలికలతో ఉద్రిక్తంగా మారింది. వరుస ఎన్కౌంటర్లతో భారీగా నష్టపోయిన సిపిఐ (మావోయిస్టు) Maoist తిరిగి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 14 వరకు “ప్రతిఘటన వారం” పాటిస్తున్నట్లు ప్రకటించింది. దీని తరువాత అక్టోబర్ 15న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఒక రోజు బంద్ కూడా పిలిచింది. మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సంకేత్ ఈ ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఏడాది ఆరంభంలో “నకిలీ ఎన్కౌంటర్లు” పేరుతో తమ నాయకులు, సభ్యులు చంపబడ్డారని ఆరోపిస్తూ, నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో జార్ఖండ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా దళాలు, ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ (Intelligence) యూనిట్లు పూర్తి స్థాయిలో సజాగ్రత్తగా ఉన్నాయని జార్ఖండ్ ఐజీ (ఆపరేషన్స్) డాక్టర్ మైఖేల్ రాజ్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – “ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని జిల్లాల్లో నిఘా బలపరచబడింది. సరందా అడవి పరిసరాలను మినహాయించి మావోయిస్టుల చురుకుదనం పెద్దగా లేదు” అని తెలిపారు.
Tamilnadu: చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిని విడుదల చేసిన ఉన్నత ధర్మాసనం
Maoist
మావోయిస్టులు (Maoist) ఈ వారం, బంద్ సమయంలో దాడులు లేదా విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అందువల్ల, పశ్చిమ సింగ్భూమ్, లాతేహార్, చత్రా వంటి జిల్లాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమల్లోకి తెచ్చారు. రాష్ట్ర నిఘా విభాగం (SIB) అన్ని జిల్లా ఎస్పీలకు సూచనలు జారీ చేసింది. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ శిబిరాలు, బ్యాంకులు, విద్యుత్ సబ్స్టేషన్లు, రైల్వే లైన్లు, మొబైల్ టవర్లు, అటవీ శాఖ భవనాలు మరియు గిడ్డంగుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు, ప్రధాన రహదారుల్లో కూడా నిఘా కొనసాగుతోంది.
ఇటీవలి సంవత్సరాల్లో జార్ఖండ్లో మావోయిస్టుల Maoist ప్రభావం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం వారు ప్రధానంగా పశ్చిమ సింగ్భూమ్ మరియు పరిసర అటవీ ప్రాంతాలకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ, గతంలో ఇలాంటి సందర్భాల్లో పోలీసు దళాలపై దాడులు జరిపిన చరిత్ర ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: