తార్నాక : (New Trains) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచే దిశగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రయాణించేలా నాలుగు కొత్త అమృత్ భారత్ వారపు ఎక్స్ప్రెస్ రైళ్లు, అలాగే రెండు కొత్త వారపు ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రవేశానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. (New Trains) ఈ కొత్త రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అస్సాం, పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా బుదవారం రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Increase Rates: భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల ధరలు
దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రయాణించే కొత్త అమృత్ భారత్ వారపు రైళ్లు:
1. 16107 / 16108 సంత్రాగాచి తాంబరం సంత్రాగాచి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
2. 16597 | 16598 ఎస్ఎంవీటీ బెంగళూరు అలీపూర్ దువార్ ఎస్ఎంవీటీ బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
3. 20603 / 20604 నాగర్ కోయిల్ న్యూ జల్పాయిగూడి నాగర్కాయిల్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
4. 20609 / 20610 తిరుచ్చిరాపల్లి న్యూ జల్పాయిగూడి తిరుచ్చిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణించే కొత్త వారపు ఎక్స్ ప్రెస్ రైళ్లు:
1. 16223 / 16224 ఎస్ఎంవీటీ బెంగళూరు రాధికాపూర్ ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్ ప్రెస్
2. 16523 /16524 ఎస్ఎంవీటీ బెంగళూరు బలూరాఘాట్- ఎస్ఎంవీటీ బెంగళూరులు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: