📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Lok Sabha: పాన్ మసాలాపై కొత్త సెస్సు.. బిల్లును ఆమోదించిన లోక్ సభ

Author Icon By Aanusha
Updated: December 5, 2025 • 7:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్‌సభ (Lok Sabha) శుక్రవారం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధిస్తూ, తద్వారా వచ్చే నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించాలని ప్రతిపాదించే ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు-2025’ కు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: Flight Ticket Price Hike : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..ప్రయాణికుల గగ్గోలు

పాన్ మసాలా కంపెనీలపై సెస్సును ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ, ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, సెస్సు ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

New cess on pan masala.. Lok Sabha approves bill

ఉత్పత్తులను తయారు చేసే యూనిట్ల

ఈ సెస్సు ద్వారా సమకూరిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.పాన్ మసాలా, ఈ తరహా ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లకు ఈ సెస్సు వర్తిస్తుంది. జాతీయ ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి అంశాలకు ఈ నిధులను వినియోగిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం పాన్ మసాలాపై జీఎస్టీ గరిష్ఠ శ్లాబు అయిన 40 శాతం విధిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ సెస్సు వల్ల జీఎస్టీ రాబడిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. తయారీ సామర్థ్యం ఆధారంగా ఈ సెస్సును విధిస్తామని పేర్కొన్నారు. 2010-14 మధ్య సెస్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 7 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 6.1 శాతానికి తగ్గినట్లు ఆమె వెల్లడించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cess Finance Minister Nirmala Sitharaman latest news Lok Sabha National Security Pan Masala public health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.