మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu), భారత ప్రధాని నరేంద్ర మోదీతో (With Narendra Modi) ఫోన్లో మాట్లాడారు. ఇది యుద్ధ పరమైన కీలక పరిణామాల మధ్య జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసిన తర్వాత ఈ సంభాషణ జరిగింది.ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని అణు స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీతో పాటు పలువురు కీలక నాయకులు మరణించారు. నాటాంజ్ అణు కేంద్రంతో సహా పలు సైట్లు ధ్వంసం అయ్యాయి.ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా, ఇరాన్ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే వీటిలో చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నశింపజేశాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
నెతన్యాహు డిప్లొమసీ – ప్రపంచ నేతలతో చర్చలు
దాడుల తర్వాత నెతన్యాహు పలు దేశాధినేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే జర్మన్ ఛాన్సలర్, ఫ్రెంచ్ అధ్యక్షుడితో సంప్రదింపులు పూర్తయ్యాయి. త్వరలో ట్రంప్, పుతిన్, కీర్ స్టార్మర్లతో కూడా మాట్లాడనున్నారు.ఇరాన్ నుంచి ముప్పు పెరుగుతోంది. అందుకే రక్షణ అవసరమైంది, అని నెతన్యాహు చెప్పినట్టు ఇజ్రాయెల్ కార్యాలయం పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు కొనసాగుతాయి అని వెల్లడించారు.
అణు చర్చల నుంచి అమెరికాతో సంబంధం గండిపడిన ఇరాన్
ఈ పరిణామాలతో ఇరాన్–అమెరికా సంబంధాలు ఉత్కంఠకు గురయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో వాషింగ్టన్ మద్దతు ఉందంటూ, ఇరాన్ అణు చర్చల నుంచి తప్పుకుంది.యునైటెడ్ నేషన్స్, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని పిలిచాయి.
Read Also : Ahmedabad plane crash : విమాన ప్రమాదం డీజీసీఏ కీలక నిర్ణయం