📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Latest News: National Herald: కక్ష సాధింపుతో రాహుల్, సోనియాపై ఇడి కేసు నమోదు

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : రాహుల్,(Rahul Gandhi) సోనియాపై కక్ష్ సాధింపుగా ఇడి కేసు నమోదు చేసిందని(National Herald) భువనగిరి ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి ఆరోపించారు. న్యూఢిల్లీలో ఆయన విలేఖరులతో -మాట్లాడతూ నేషనల్ హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు ధృవీకరించిందని ఆయన చెప్పారు. బలమైన ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బిజెపి పాలకులపై కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: BRS: బిఆర్ఎస్ఎల్పీ సమావేశం 21కి వాయిదా

National Herald ED registers case against Rahul and Sonia out of vendetta.

ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై చామల ఆగ్రహం

ఉపాధిహామి పథకంకు మహాత్మా గాంధీ(National Herald) పేరు తొలగించి విబిజిరామ్ జిగా మార్చడం ఆర్ఎస్ఎస్ బిజెపి సంకుచిత ఆలోచన విదానంకు రుజవంటూ దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ పేరును చరిత్ర నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోపాటు ఈ పథకాన్ని బలహీనపరిచి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై చామల ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి ఉందన్నారు. 125 రోజులు అంటూనే ఉపాధి హామీని అస్పష్టంగా మార్చారంటూ కేంద్రంపై ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి దేవుడి పేరు. పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం తీరును తప్పుపట్టారు. ఈ పథకం పేరుతోపాటు అమలులో తీసుకు వచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని ఎంపీ చామల స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. గ్రామీణ పేద ప్రజలకు 100 రోజుల గ్యారెంటీ ఉపాధి కల్పించాలనే లక్ష ్యంతో అప్పటి కేంద్రం 100శాతం కేటాయించాలని నిధులు కేటాయించిందని రెడ్డి గుర్తు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


Chamala Kiran Kumar Reddy ED case Latest News in Telugu National Herald NREGA Controversy rahul gandhi sonia gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.