हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Narendra Modi: దలైలామా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Sharanya
Narendra Modi: దలైలామా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) తన 90వ పుట్టినరోజు (2025 జూలై 6) జరుపుకుంటున్న సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి పలువురు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల నాయకులు, ఆధ్యాత్మిక సామాన్య ప్రజలు ఆయన జీవితాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు పంపిస్తున్నారు.

ప్రధాని మోదీ సందేశం – ప్రేమ, కరుణకు ప్రతీక

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (ఇటీవల ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, ‘‘దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 1.4 బిలియన్ల భారతీయులతో కలిసి నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని’’ ప్రధానమంత్రి రాశారు. ‘‘ఆయన ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు చిరస్మరణీయ చిహ్నం (A memorable symbol of moral discipline). ఆయన సందేశం అన్ని మతాల ప్రజలలో గౌరవం మరియు ప్రశంసలను ప్రేరేపించింది. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు సందేశం – శాంతి మార్గదర్శి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రత్యేక ట్వీట్‌లో దలైలామాతో తాను కలసి ఉన్న ఫోటోను పంచుకుంటూ, “పవిత్ర దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శాంతి, కరుణ, ఆధ్యాత్మిక బలానికి ప్రపంచవ్యాప్త చిహ్నం, ఆయన సామరస్యం సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది” అని ఆయన రాశారు.

దలైలామా కీలక ప్రకటన – ‘‘నేను 130 ఏళ్లు బ్రతుకుతాను’’

తన పుట్టినరోజుకి ముందురోజు, మీడియాతో మాట్లాడుతూ దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన 90వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘నేను ఇంకా 130 సంవత్సరాలు జీవిస్తానని’’ ఆయన అన్నారు. వారసుడి ఎన్నిక, వివాదాల మధ్య, దలైలామా శనివారం ఇలా కీలక ప్రకటన చేశారు. ‘‘అనేక ప్రవచనాలను పరిశీలిస్తే, నాకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా 30-40 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నాను. బహుశా నేను 130 సంవత్సరాలకు పైగా జీవిస్తాను.’’ అంటూ వెల్లడించారు.

దలైలామా జీవితం – ధ్యానం నుండి దౌత్యం దాకా

టెన్జిన్ గ్యాట్సో 14వ దలైలామా. ఆయన జూలై 6, 1935న జన్మించారు. ఆయన టిబెట్ దేశాధినేత, ఆధ్యాత్మిక గురువు. ఆయన తొలిసారిగా 1959లో చైనా నుండి తవాంగ్ చేరుకున్నారు. అప్పటి నుండి ఆయన భారతదేశంలో నివసిస్తున్నారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన 65 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించారు. అంతే కాకుండా, ఆయన ఇప్పటివరకు 85 కంటే ఎక్కువ గౌరవాలను అందుకున్నారు.

ధర్మశాలలో ప్రారంభమైన 15వ టిబెటన్ మతపరమైన సమావేశం

దలైలామా పుట్టినరోజు సందర్భంగా, తన వారసుడిని ప్రకటించారనే పుకార్ల మధ్య దలైలామా ఈ ప్రకటన చేశారు. దలైలామా పుట్టినరోజున హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జూలై 2న మూడు రోజుల 15వ టిబెటన్ మతపరమైన సమావేశం ప్రారంభమైంది. ‘‘నా మరణం తర్వాత, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక చేస్తామని’’ ఆయన చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: India : ఆదాయ సమానత్వంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన భారత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870