Narendra Modi Stadium: లక్షలాది మంది అభిమానుల మధ్య కోలాహలంగా సాగే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు ఒక సవాలుగా మారింది. ప్రపంచ స్థాయి వసతులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన ఐసీసీ (ICC) టోర్నీలలో ఈ మైదానం భారత్కు అదృష్టాన్ని తీసుకురావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతగడ్డపై లక్ష మందికి పైగా అభిమానుల మద్దతు ఉన్నా, నిర్ణయాత్మక మ్యాచ్ల్లో టీమిండియా ఇక్కడ తడబడుతుండటం గమనార్హం.
Read Also: Rajahmundry Milk Case: కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష
భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరుపురాని విషాదంగా మిగిలిపోయిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఈ మైదానంలోనే జరిగింది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సుమారు 1.30 లక్షల మంది నీలిరంగు జెర్సీలతో భారత్కు మద్దతు తెలుపుతున్నా, ఆస్ట్రేలియా విజయం సాధించినప్పుడు స్టేడియంలో నెలకొన్న నిశ్శబ్దం భారత ఆటగాళ్లను తీవ్రంగా కలచివేసింది.
ప్రత్యర్థి జట్లకు వరం
పిచ్ మందకొడిగా ఉండటం, బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బంది పడటం ఆనాడు ప్రపంచ కప్ను భారత్కు దూరం చేశాయి.నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ స్వభావం అంచనా వేయడం టీమిండియాకు కష్టతరంగా మారుతోంది. ఇక్కడ ఎరుపు, నలుపు మట్టితో కూడిన పిచ్లు ఉన్నాయి. బౌన్స్ నిలకడగా లేకపోవడం, బంతి మందకొడిగా బ్యాటు మీదకు రావడం వల్ల బ్యాటర్లు షాట్లు ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే సమయంలో బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా మారుతోంది.మరోవైపు టాస్ కూడా ఇక్కడ ఫలితాన్ని శాసిస్తోంది.
ఐపీఎల్ వంటి భారీ టోర్నీల ఫైనల్స్ ఇక్కడ జరిగినప్పుడు కూడా టాస్ గెలిచిన జట్లకే విజయావకాశాలు మెండుగా ఉండటం గమనార్హం. సాయంత్రం వేళల్లో కురిసే మంచు ప్రభావం ఆటను పూర్తిగా మార్చేస్తోంది. రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు బంతిపై పట్టు చిక్కకపోవడం ప్రత్యర్థి జట్లకు వరంగా మారుతోంది. 2026 టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం కూడా ఇక్కడి పరిస్థితులను భారత్ సరిగ్గా అంచనా వేయలేకపోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: