Telugu News: Narendra Modi: రేర్ ఎర్త్ రంగంలోకి దూసుకెళ్తున్న భారత్- చైనా ఆధిపత్యం

Read Time:  1 min
Narendra Modi
Narendra Modi
FONT SIZE
GET APP

అరుదైన భూమి అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్)(Rare Earth Magnets) తయారీ రంగంలో చైనా(China) ఆధిపత్యానికి గండికొట్టేందుకు భారత్ ఓ భారీ వ్యూహంతో ముందుకొస్తోంది. ఈ కీలక రంగంలో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం విలువను మూడు రెట్లు పెంచి రూ. 7,000 కోట్లకు పైగా (సుమారు $788 మిలియన్లు) చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలు,(electric vehicles,) పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ పరికరాల తయారీలో ఈ అయస్కాంతాలు అత్యంత కీలకం.

Read Also: Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Narendra Modi

చైనా ఆంక్షలు, భారత వ్యూహం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం రేర్ ఎర్త్ ఖనిజాలను చైనాయే ప్రాసెస్ చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో ఈ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు కఠినతరం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ‘కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చవద్దని’ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హెచ్చరించిన నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తాజా ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తోందని సమాచారం. ఈ పథకం కింద, ఉత్పత్తి ఆధారిత, మూలధన సబ్సిడీల ద్వారా సుమారు ఐదు దేశీయ కంపెనీలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వనుంది.

సవాళ్లు, భవిష్యత్ ప్రత్యామ్నాయాలు

చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడం భారత్‌కు అంత సులభం కాదు. ఈ రంగంలో నిధుల కొరత, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, అలాగే రేడియోధార్మిక వ్యర్థాల కారణంగా తవ్వకాలలో పర్యావరణ సమస్యలు వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి, ప్రభుత్వం రేర్ ఎర్త్ ఖనిజాలపై ఆధారపడటాన్ని తగ్గించే సింక్రోనస్ రిలక్టెన్స్ మోటార్ల సాంకేతికతపై పరిశోధనలకు నిధులు సమకూరుస్తోంది. అయితే, అమెరికా, యూరప్ దేశాలకు ఇచ్చినట్టుగానే, భారత్‌కు కూడా చైనా ఎగుమతి నియంత్రణలను సడలిస్తే, చౌకైన చైనా మ్యాగ్నెట్స్ భారత మార్కెట్‌ను ముంచెత్తి, దేశీయ పెట్టుబడులను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.