Mumbai: నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

Read Time:  1 min
Mumbai: నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
FONT SIZE
GET APP

అరేబియా సముద్రంలో సాగుతున్న భారీ అంతర్జాతీయ చమురు (Oil) స్మగ్లింగ్ రాకెట్ను భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది శనివారం భగ్నం చేశారు. (Mumbai) ముంబయికి 100 నాటికల్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అడ్డుకున్నారు.

Read Also: Karnataka: నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

Mumbai: నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
Oil smuggling gang arrested in the middle of the sea.

తదుపరి దర్యాప్తు కోసం ముంబయికి తరలించే అవకాశం

యుద్ధ వాతావరణం నెలకొన్న దేశాల నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసి, వాటిని అంతర్జాతీయ జలాల్లోని ఇతర మోటార్ ట్యాంకర్లకు మధ్య సముద్రంలోనే బదిలీ చేయడం ఈ ముఠా ప్రధాన పని. దీని ద్వారా భారీ లాభాలను ఆర్జించడమే కాకుండా, తీరప్రాంత దేశాలకు చెల్లించాల్సిన సుంకాలను ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. (Mumbai) ఈ ముఠాను పట్టుకోవడంలో భారత కోస్ట్ గార్డ్ అత్యాధునిక ‘టెక్-ఇంక్లూజివ్’ నిఘా వ్యవస్థను వినియోగించింది. భారత ప్రత్యేక ఆర్థిక మండలి లో ఒక మోటార్ ట్యాంకర్ అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన అధికారులు డిజిటల్ డేటా అనాలిసిస్ ద్వారా దానితో సంబంధం ఉన్న మరో రెండు నౌకలను గుర్తించారు.

ఫిబ్రవరి 5న కోస్ట్ గార్డ్ ప్రత్యేక బృందాలు ఈ నౌకలను చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. నౌకల్లోని ఎలక్ట్రానిక్ డేటా, పత్రాలను పరిశీలించి, సిబ్బందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘర్షణలు జరుగుతున్న దేశాల నుంచి తక్కువ ధరకు చమురును సేకరించి, అంతర్జాతీయ జలాల ద్వారా మోటార్ ట్యాంకర్లలో అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ సుంకాలను ఎగ్గొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నౌకలను తదుపరి దర్యాప్తు కోసం ముంబయికి తరలించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.