📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

MP Sanjay: అజిత్ మృతి అనుమానాస్పదమే.. దర్యాప్తు కోరిన రౌత్

Author Icon By Pooja
Updated: February 2, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై శివసేన ఎంపీ సంజయ్(MP Sanjay) రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బయటకు వస్తున్న సమాచారం, పరిణామాలను గమనిస్తే ఈ విమాన ప్రమాదం సాధారణంగా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Tamil Nadu: టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, అజిత్ పవార్ మృతిపై దేశ ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని రౌత్(MP Sanjay) అన్నారు. అలాగే ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి బీజేపీ అడ్డంకిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయంగా కీలకమైన దశలో అజిత్ పవార్ లాంటి అనుభవజ్ఞుడైన నేత విమాన ప్రమాదంలో మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా? సాంకేతిక లోపాల వల్లే ప్రమాదం జరిగిందా? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు ద్వారా నిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu MaharashtraPolitics PlaneCrash

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.