ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బిహార్ పోలీసులతో కలిసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు మట్టుబడ్డారు. రాత్రి అర్ధరాత్రి సమయంలో పోలీసులు గ్యాంగ్స్టర్లను చుట్టుముట్టగా, వారు కాల్పులు ప్రారంభించడంతో భీకర ఫైరింగ్ జరిగింది. స్వీయరక్షణార్థం పోలీసులు కూడా ప్రతీకారంగా కాల్పులు జరపగా, రంజన్ పాఠక్ (25), బిమలేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) అనే నలుగురు దుండగులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఆపరేషన్ సుమారు 45 నిమిషాలపాటు కొనసాగిందని పోలీసులు వెల్లడించారు.
Breaking News – Medaram : మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ గ్యాంగ్ బిహార్లో పలు రాష్ట్రాల మధ్య క్రిమినల్ నెట్వర్క్ నిర్వహిస్తూ, ఎక్స్టార్షన్, స్మగ్లింగ్, రాజకీయ నేతలపై దాడుల కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఇటీవల జరిగిన ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో వీరు బిహార్ ఎన్నికల ముందు రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. ఈ సమాచారంతోనే ఢిల్లీ పోలీసులు బిహార్ టీమ్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ ప్లాన్ చేసి రోహిణిలో ట్రాప్ ఏర్పాటు చేశారు. అయితే, దొంగల బృందం లొంగేందుకు నిరాకరించి కాల్పులు ప్రారంభించడంతో ఘర్షణ తప్పలేదని అధికారులు వివరించారు.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా స్పందిస్తూ, “దేశవ్యాప్తంగా నేర శృంఖలాలను చీల్చేందుకు మా చర్యలు కొనసాగుతాయి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు, బిహార్ డీజీపీ ఈ ఆపరేషన్ను అత్యంత విజయవంతమని అభివర్ణిస్తూ, ఎన్నికల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సంయుక్త చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో బిహార్, ఢిల్లీ పోలీసు బలగాల సమన్వయం మరింత బలపడనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/