Artificial Intelligence: రైల్వే శాఖలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించనుంది. ముఖ్యంగా రైళ్ల టాయిలెట్ల శుభ్రతపై తరచూ వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. తొలిదశలో 100 రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. క్లీనింగ్ సిబ్బందికి మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు, శుభ్రతకు ముందు, తర్వాత ఫోటోలు అప్ లోడ్ చేయాలి. ఏఐ ఈ ఫోటోలను పరిశీలించి, సేవల నాణ్యతను మదింపు చేస్తుంది. శుభ్రత సరిగా లేకుంటే సిబ్బందిని అలెర్ట్ చేసి, అవసరమైతే ఫైన్ విధిస్తారు. పని ఎగ్గొట్టే ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఏఐను ఆయుధంగా రైల్వే శాఖ వాడుతుంది.
Read Also: AI Summit : పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: