Latest Telugu News : Mohan Bhagwat : ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం : మోహన్‌ భగవత్‌

Read Time:  1 min
Mohan Bhagwat
Mohan Bhagwat
FONT SIZE
GET APP

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకమని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటిస్తున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.

Read Also : http://Digital Gold: ‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్

Mohan Bhagwat
Mohan Bhagwat


‘ప్రపంచంలోని ప్రతీ దేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్‌ (గ్రీస్‌), మిస్ర్‌ (ఈజిప్ట్), రోమ్ వంటి గొప్ప నాగరికతలు నశించిపోయాయి. కానీ మన నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే మనం ఇంకా ఇక్కడ ఉన్నాం. భారత్‌ అనేది అంతంలేని నాగరికతకు పేరు. మన సమాజంలో మనం ఓ బలమైన వ్యవస్థను నిర్మించుకున్నాం. దాని కారణంగానే హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుంది. హిందువులు ఉనికి కోల్పోతే.. ప్రపంచానికే ఉనికి ఉండదు. ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం’ అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ఆర్ఎస్ఎస్ బిజెపి ఒకటేనా?

రాజకీయ వర్ణపటంలో బిజెపి కుడి-వైపు నుండి తీవ్ర-కుడి వైపు ఉంటుంది మరియు దీనికి తీవ్ర-కుడి పారామిలిటరీ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో సైద్ధాంతిక మరియు సంస్థాగత సంబంధాలు ఉన్నాయి. పార్టీ విధానాలు హిందూ జాతీయవాద భావజాలమైన హిందూత్వకు కట్టుబడి ఉంటాయి.

ఆర్ ఎస్ ఎస్ అంటే ఏమిటి?

RSS అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్. మీకు ముఖ్యమైన వార్తలు మరియు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం, మరియు వెబ్‌సైట్‌లలో సమాచారాన్ని బ్రౌజ్ చేయడం లేదా శోధించడం వంటి సాంప్రదాయ పద్ధతులను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.