ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య ఏర్పడుతున్న స్నేహ బంధం అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ముగ్గురు నేతల సమీపతకు ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవాస్తవ, దూకుడు విధానాలేనని అమెరికా మీడియా (American media) విమర్శిస్తోంది.అమెరికన్ మీడియా అభిప్రాయం ప్రకారం, ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే ఆయనకు ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి. భారత్, రష్యా, చైనా ఒకే వేదికపై ఐక్యత ప్రదర్శించడం ద్వారా అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.(Vaartha live news : Narendra Modi)
ఎస్సీఓ సదస్సులో స్నేహ ప్రదర్శన
టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఈ ఐక్యతకు వేదికైంది. మోదీ, పుతిన్, జిన్పింగ్ ముగ్గురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటున్న వారి ఫొటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, ప్రధాని మోదీ చివరి నిమిషంలో పుతిన్ కారులో ప్రయాణించడం వారి బంధం బలాన్ని స్పష్టం చేసింది.‘ది న్యూయార్క్ టైమ్స్’ ఈ పరిణామాలను విశ్లేషిస్తూ, అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ ముగ్గురు నేతలు కూటమి కడుతున్నారని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ‘సీఎన్ఎన్’ ఈ సమావేశాన్ని అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఓ బలమైన సవాలుగా అభివర్ణించింది.
చమురు, సుంకాల వివాదం
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని కారణంగా ట్రంప్ ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించింది. దీనికి బదులుగానే మోదీ ఈ సమావేశంలో పాల్గొని అమెరికాకు గట్టి హెచ్చరిక పంపారనే విశ్లేషణను ‘ఫాక్స్ న్యూస్’ ప్రచురించింది. ట్రంప్ చర్యలే ఎస్సీఓ సదస్సుకు కొత్త ఊపిరి పోశాయని యూరేషియా గ్రూప్ విశ్లేషకుడు జెరెమీ చాన్ అభిప్రాయపడ్డారు.‘ది వాషింగ్టన్ పోస్ట్’ భారత్తో ట్రంప్ వైరం తిరగవచ్చు అనే శీర్షికతో సంపాదకీయం రాసింది. అలాగే, ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ట్రంప్ అసాధారణ విధానాల వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఐక్యతా ప్రదర్శన బయటపెడుతోందని పేర్కొంది.
మారుతున్న అంతర్జాతీయ సమీకరణలు
మోదీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై కలవడం ద్వారా ఆసియా ప్రాంతంలో కొత్త రాజకీయ సమీకరణలు స్పష్టమవుతున్నాయి. అమెరికా విధానాలు ఈ ఐక్యతను మరింత బలపరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also :