ఛత్తీస్గఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఓ అరుదైన, హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. రాయ్పూర్లో జరిగిన రాష్ట్ర రజతోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ గిరిజన సమాజ సభ్యులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సమావేశంలో గిరిజనులు తమ సంస్కృతిని ప్రతిబింబించే నెమలి పింఛాలతో అలంకరించిన సాంప్రదాయ తలపాగా (పగిడి)ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. అయితే, భద్రతా కారణాల వల్ల దానిని వేదికలోకి అనుమతించలేదని వారు బాధపడ్డారు.
Read also: WWC 2025: ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
వారి మాట విన్న ప్రధాని వెంటనే స్పందించి, భద్రతా సిబ్బందిని పిలిచి తలపాగాను లోపలికి తీసుకురావాలని ఆదేశించారు. కొద్ది సేపట్లోనే గిరిజనులు ఆ పగిడిని వేదికపై మోదీకి బహూకరించగా, ప్రధాని హర్షంతో స్వీకరించారు. ఆ క్షణం సభలో హర్షధ్వానాలతో మార్మోగింది.
చత్తీస్గఢ్లో చారిత్రక ప్రారంభాలు
ప్రధాని మోదీ ఈ సందర్బంగా కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన జ్ఞాపకాలను స్మరించారు. అదేవిధంగా, దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన మ్యూజియంను కూడా మోదీ ప్రారంభించారు. ఇది ఛత్తీస్గఢ్ గౌరవాన్ని కాపాడటానికి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ వీరులకు అంకితం చేయబడింది. ఈ మ్యూజియం ద్వారా గిరిజన సమాజం చేసిన త్యాగాలు, వీరోచిత గాధలు, సాంస్కృతిక వారసత్వం కొత్త తరాలకు చేరువవుతున్నాయి.
గిరిజన సంస్కృతికి ప్రధాని గౌరవం
తన బిజీ షెడ్యూల్లోనూ గిరిజనులతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన మోదీ, వారి సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చూపడం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సాంప్రదాయ పగిడిని స్వీకరించిన ఆ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “ప్రధాని మనసు గెలిచిన గిరిజనుల ప్రేమ” అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన రజతోత్సవ వేడుకల్లో జరిగింది.
గిరిజనులు ప్రధానికి ఏ బహుమతి ఇవ్వాలనుకున్నారు?
నెమలి పింఛాలతో అలంకరించిన సాంప్రదాయ తలపాగా (పగిడి).
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: