Modi : రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ: ఉద్రిక్తతల తాజా పరిస్థితిపై చర్చలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న ఊహగానాలు వెలువడుతున్న వేళ, ప్రధాని నరేంద్రమోడీతో భారత రక్షణ కార్యదర్శి రాజేశ్కుమార్సింగ్ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఆదివారం వైమానికదళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపారితో ప్రధాని మాట్లాడారు. ఈ ఇద్దరితో మోడీ భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని క్లిష్టమైన 3 మార్గాల్లోని పరిస్థితిని ప్రధానికి నేవీచీఫ్ త్రిపాఠి వివరించారు. వైమానికదళ చీఫ్, నేవీ చీఫ్ తో మాట్లాడిన మోడీ, తాజాగా రక్షణ కార్యదర్శితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.పహల్గాంలో 26 మందిని బలి చేసిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రం ఇప్పటికే ప్రతినిధిని బూనింది. ఈ క్రమంలో, గత కాలంలో అనుమతించడాన్ని ఆమోదించకుండా ప్రధాని మోడీ నిర్ణయించారు. మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్మీకి విమానసర్వీసులను తమ గగనతలం వరకు అనుమతించాలని నిర్ణయించారు. భద్రతా ఉన్నతాధికారులతో ఇప్పుడు వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నట్లు చర్చనీయాంశంగా మారింది.
Modi : రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ
యుద్ధ సన్నద్ధత చర్యలు ప్రారంభించామని సంకేతాలు అందజేస్తూ గంగా ఎక్స్ ప్రెస్వేపై జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలు కూడా చేసింది. త్రివిధ దళాధిపతులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించిన తర్వాత, ఇప్పుడు కొత్త రక్షణశాఖ కార్యదర్శితో జరిగిన సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. నేరుగా రంగంలోకి దిగి దాడులు చేయకపోయినా పాకిస్థాన్ను నలువైపులా దిగ్బంధం చేస్తున్న భారత్, సింధు జలాల నిలిపివేత, బగలిహార్, సలాలా డ్యామ్లలో నీటిని నిలిపివేసింది. ఎగుమతి దిగుమతులు కూడా రద్దు చేసుకుంది. అదే క్రమంలో, పాక్ ఓడలను కూడా నిషేధించింది. భారత్ ఓడలను పాక్ వైపు వెళ్లవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. భారత్ గగనతలాన్ని పాక్ విమానాలకు మూసివేసింది. అలాగే పాక్ కూడా భారత సరిహద్దుల్లో ఇప్పటికీ కవ్వింపు కాల్పులు జరుగుతున్నాయి.
క్రమంలో, ప్రధాని మోడీ వేరువేరుగా నిర్వహిస్తున్న సమావేశాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, భారతపై పాకిస్థాన్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ హ్యాకర్లు భారత రక్షణ వెబ్సైట్లు లక్ష్యంగా ఉంచి, ఆన్లైన్లో క్షుణ్ణంగా ఉద్దేశపూర్వకంగా ఆడిట్ చేయాలని ప్రయత్నించారు. అదే సమయంలో, సైబర్ భద్రతా అధికారులు, ఇండియన్ మిలిటరీ ఏజెన్సీలు చురుకుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, డిజిటల్ రక్షణను బలోపేతం చేయాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (IDSA) పేర్కొన్నాయి. ఈ పరిస్థితులలో, సైబర్ ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ను హ్యాకర్ల నుండి రక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు తెలిపారు.
Read More : Russia: ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో భారతకు రష్యా పూర్తి మద్ధతు