Modi Isreal visit: ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా లభించిన ఆతిథ్యానికి భారత ప్రధానమంత్రి Narendra Modi హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పర్యటన మొత్తం ఇజ్రాయెల్ ప్రజలు చూపిన ఆప్యాయత తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తనకు వీడ్కోలు చెప్పేందుకు Benjamin Netanyahu మరియు ఆయన సతీమణి Sara Netanyahu స్వయంగా Ben Gurion Airportకు రావడం ఎంతో భావోద్వేగ క్షణమని చెప్పారు.
Read Also:AI collaboration india israel : భారత్ ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!
ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ – ఉగ్రవాదంపై ఉమ్మడి సంకల్పం
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని, భారత్–ఇజ్రాయెల్ భాగస్వామ్యం రాబోయే కాలంలో మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆవిష్కరణలు, సాంకేతికత, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాల్లో 27 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను త్వరలో ఖరారు చేయాలని ఉద్దేశం వ్యక్తమైంది. హైటెక్ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రసంగంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం భారత భద్రతకు కీలకమని తెలిపారు. గాజా శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని చెప్పారు.
ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రధాని నెతన్యాహు ఈ పర్యటనను విశిష్టమైనదిగా అభివర్ణించారు. భారత ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రసంగం ఇజ్రాయెల్ ప్రజల హృదయాలను కదిలించిందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని మరింత విస్తరించేందుకు త్వరలో భారతదేశంలో ప్రభుత్వాల మధ్య (G2G) సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: