📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

prime minister: Modi: భారత నదులే దేశ అభివృద్ధికి పునాది

Author Icon By Rajitha
Updated: October 17, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీ (Modi) భారతదేశంలోని జలమార్గాల ప్రాధాన్యతపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ రాసిన వ్యాసాన్ని ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకొని, నదులు కేవలం పునరుజీవం పొందిన వారసత్వ చిహ్నాలు మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక, రవాణా, పర్యాటక రంగాల అభివృద్ధికి కీలక రహదారులుగా మారిందని గుర్తుచేశారు. గతంలో మన దేశంలో 5 జాతీయ జలమార్గాలే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 111కి పెరిగి, 32 మార్గాలు ఇప్పటికే సక్రియంగా పని చేస్తున్నాయి. 2013-14లో కేవలం 18 మిలియన్ టన్నుల సరుకు రవాణా 2024-25 నాటికి 145 మిలియన్ టన్నులకె చేరింది. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గడం, కాలుష్యం నియంత్రణ, చౌకైన రవాణా వంటి ప్రయోజనాలు వచ్చాయని ప్రధాని మోదీ (Modi) పేర్కొన్నారు.

Read also: Shaik Haseena: షేక్ హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలు ..చీఫ్ ప్రాసిక్యూటర్

Modi: భారత నదులే దేశ అభివృద్ధికి పునాది

అదేవిధంగా, నదీ పర్యాటక రంగం (రివర్ టూరిజం) కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దశాబ్దం క్రితం కేవలం 5 క్రూయిజ్ నౌకలు ఉండగా, ఇప్పుడు 13 జలమార్గాల్లో 25 క్రూయిజ్ నౌకలు సేవలందిస్తున్నాయి. ప్రధాన నదీలైన గంగా, బ్రహ్మపుత్ర, కేరళ బ్యాక్‌వాటర్స్ వంటి ప్రాంతాలు ఈ రంగంలో ముందున్నాయి. అలాగే, వారణాసి, కోల్‌కతా, పాట్నా, గౌహతి వంటి టెర్మినళ్లను ఆధునికీకరిస్తున్నామని ఆయన వివరించారు. ప్రధాని మోదీ (Modi) జలమార్గాల అభివృద్ధి ద్వారా భారతదేశానికి కొత్త రవాణా మార్గాలను, పర్యాటక అవకాశాలను సృష్టించడం, మరియు ఈ రంగంలో కొనసాగుతున్న పురోగతిని గమనించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో జాతీయ జలమార్గాల సంఖ్య 2014 నుంచి 2024 వరకు ఎలా పెరిగింది?
2014లో 5 జాతీయ జలమార్గాలు ఉండేవి, 2024 నాటికి వాటి సంఖ్య 111కి పెరిగింది.

2013-14లో సరుకు రవాణా పరిమాణం ఎంత ఉండేది?
ఆ సంవత్సరం సరుకు రవాణా పరిమాణం 18 మిలియన్ టన్నులుగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

: India Inland Waterways latest news Narendra Modi River Transport Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.