📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul : మోదీలో దమ్ము లేదు – రాహుల్ గాంధీ

Author Icon By Sudheer
Updated: July 25, 2025 • 8:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై నిశితంగా వ్యాఖ్యలు చేశారు. “నిజం చెప్పాలంటే మోదీకి ధైర్యం లేదు. ఆయనపై క్రియేట్ అయ్యే హైప్ అంతా మీడియా ద్వారా. అంతా ఒక షో మాత్రమే,” అని అన్నారు. మోదీని తాను మూడు సార్లు కలిశానని చెప్పిన రాహుల్, ఆయన వ్యక్తిత్వం పూర్తిగా ప్రచారంపై ఆధారపడిందని పేర్కొన్నారు.

మోదీ పెద్ద సమస్య కాదు – రాహుల్ అభిప్రాయం

మోదీ (Modi) అంతటి పెద్ద సమస్య కాదని రాహుల్ స్పష్టం చేశారు. “అయనను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మోదీ నిజమైన నాయకత్వ లక్షణాలు కలవాడు కాడు. ప్రజల్లో భయం కలిగించేలా ఆయనను మీడియా చూపిస్తుంది. వాస్తవానికి మోదీ తక్కువ ధైర్యం కలవాడు,” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఈ మాటల ద్వారా ప్రధాని మోదీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

న్యాయ్ సమ్మేళన్ వేదికగా కేంద్రంపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాహుల్ గాంధీ న్యాయ్ సమ్మేళన్ వేదికగా మరోసారి దాడి చేశారు. సామాజిక న్యాయం, ఐక్యతే తమ లక్ష్యమని, ప్రజల హక్కులు కాపాడటమే తమ దృష్టి అని చెప్పారు. దేశంలో వర్గాల మధ్య చిచ్చు పెడుతూ, సెంట్రలైజ్డ్ పాలన రాబోతున్న మోదీ విధానాలను ప్రజలు గమనించాలన్నారు. న్యాయ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్యాయాన్ని ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also : BRSV : రేపు బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు

Google News in Telugu modi rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.