📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Vande Bharat Train: రైలులో సీటు మారేందుకు గొడ‌వ .. ప్ర‌యాణికుడిపై ఎమ్మెల్యే వ్య‌క్తుల దాడి

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైలు బోగీలో ఎమ్మెల్యే ఓ చోట‌, ఆయ‌న ఫ్యామిలీ(Family) మ‌రో చోట కూర్చున్నారు. అయితే సీటు మారేందుకు ఓ ప్ర‌యాణికుడి నిరాక‌రించ‌డంతో.. వందేభార‌త్ రైలు(Vande Bharat Train)లో గొడ‌వ మొద‌లైంది. బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన వ్య‌క్తులు యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌ (Jhansi Railway Station)లో ఆ ప్ర‌యాణికుడిపై దాడి చేశారు.

Vande Bharat Train: రైలులో సీటు మారేందుకు గొడ‌వ .. ప్ర‌యాణికుడిపై ఎమ్మెల్యే వ్య‌క్తుల దాడి

ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఆ వ్య‌క్తికి మ‌ధ్య గొడ‌వ
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభార‌త్ రైలు(Vande Bharat Train)లో ఓ ప్ర‌యాణికుడిని ఎమ్మెల్యేకు సంబంధించిన వ్య‌క్తులు చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న కెమెరాల‌కు చిక్కింది. యూపీలోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ త‌న భార్య‌, కుమారుడితో క‌లిసి వందేభార‌త్ రైలు ఎక్కారు. అయితే ఓ బోగీలో ఎమ్మెల్యే సింగ్‌కు సీటు ఓ చోట‌, త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌కు మ‌రో చోటు సీటు దొరికింది. కుటుంబ‌స‌భ్యులు కూర్చున్న చోట మ‌రో ప్ర‌యాణికుడు కూర్చుకున్నాడు. అయితే సీటు మారేందుకు అత‌ను నిరాక‌రించాడు. దీంతో ఎమ్మెల్యే ఫ్యామిలీకి, ఆ వ్య‌క్తికి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.
అయితే ఝాన్సీ రైల్వే స్టేష‌న్ కు రైలు చేరుకున్న త‌ర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్య‌క్తులు వ‌చ్చి ఆ ప్ర‌యాణికుడిపై దాడికి పాల్ప‌డ్డారు. ఆ ప్ర‌యాణికుడిపై సుమారు డ‌జ‌న్ మంది ఏక‌ప‌క్షంగా దాడి చేశారు. చెప్పుల‌తోనూ అత‌నిపై విరుచుకుప‌డ్డారు. అత‌ని శ‌రీరం, దుస్తులు మొత్తం ర‌క్తంతో నిండిపోయాయి. ఈ ఘ‌ట‌న‌పై ఝాన్సీ ఎస్పీ విపుల్ కుమార్ శ్రీవాత్స‌వ్ కేసు బుక్ చేసి విచార‌ణ మొలుపెట్టారు.
ఎన్సీఆర్ కేసు బుక్
సీట్లు మార్పు విష‌యంలో గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా స‌రైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్సీఆర్ కేసు బుక్ చేశారు. భార్య పిల్ల‌ల‌తో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో.. తోటి ప్ర‌యాణికుడు త‌న కుటుంబంతో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఎమ్మెల్యే త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also:Teacher: 24 మంది బాలికలపై ఉపాధ్యాయుడి వేధింపులు.. అరెస్ట్

#BJPControversy #BJPMLA #PassengerRights #RailwayAssault #SeatDispute #telugu News #vandebharat Breaking News in Telugu due to row over seat change Google news Google News in Telugu Jhansi MLA's men attack Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.