బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం
బీహార్(MK Stalin) అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఇది బీహార్లో ఎన్డీఏకి మరో విజయం సాధించినట్టయింది. విపక్షం మహాఘఠ్బంధన్ మాత్రం 34 సీట్లతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఫలితాలను ఆసక్తికరంగా పరిశీలించారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు అభినందనలు తెలిపే ముందు, ఇండియా కూటమి ఈ ఫలితాలను ఒక పాఠంగా తీసుకోవాలని సూచించారు.
Read also: మతం మార్చుకుని, పాక్ వ్యక్తిని పెళ్లాడిన భారతీయ సిక్కు మహిళ

స్టాలిన్ అభిప్రాయం
స్టాలిన్ ఈ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ బీహార్ లో విజయం సాధించిన నితీశ్ కుమార్కు అభినందనలు. అలాగే గట్టిగా పోరాటం చేసిన తేజస్వీ యాదవ్ను కూడా అభినందిస్తున్నాను. ఎన్నికల(MK Stalin) ఫలితాలు ప్రజల సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులు, మరియు రాజకీయ సందేశం పై ఆధారపడి ఉంటాయి. ఈ ఫలితాలు ఇండియా కూటమికి పాఠంగా ఉంటాయి. మనం వీటి నుంచి చాలా నేర్చుకోవాలి అని పేర్కొన్నారు. స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి అనుభవజ్ఞులైన నేతలతో నిండిపోయి ఉంది. వారు తమ వ్యూహాలతో సవాళ్లను అధిగమిస్తారని నేను నమ్ముతున్నాను అని అన్నారు.
ఎన్నికల సంఘంపై అభ్యంతరాలు
స్టాలిన్ ఎన్నికల సంఘం ఈసీపై కూడా విమర్శలు చేశారు. ఈసీపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని నేను అనుకుంటున్నాను. ఈ సంస్థ ప్రతిష్ట దిగజారిపోయింది. జాతీయ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చను మొదలుపెట్టింది అని ఆయన వ్యాఖ్యానించారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి మరియు రాజకీయ వర్గాలలో వీటిపై వాదనలు మొదలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: