📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

MK Stalin : మోదీ పర్యటనకు డుమ్మా కొట్టిన సీఎం స్టాలిన్

Author Icon By Divya Vani M
Updated: April 6, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని పాంబన్ వద్ద నిర్మించిన కొత్త వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది దేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తప్పకుండా హాజరు కావాల్సింది. కానీ స్టాలిన్ కార్యక్రమానికి రాకపోవడం వెనుక గల కారణాలపై రాజకీయ చర్చ ముదిరింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఒడిదొడుకులు దీనికి దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం.స్టాలిన్ ఇప్పటికే జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. 1971 జనాభా గణాంకాల ప్రకారమే పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని పర్యటన సమయంలో స్పష్టంగా ప్రస్తావించారు కూడా.ఇక మరో కీలక అంశం హిందీ భాషా వివాదం.

MK Stalin మోదీ పర్యటనకు డుమ్మా కొట్టిన సీఎం స్టాలిన్

తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో గళమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హిందీని మించిన ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రానికి అంగీకారంగా లేదన్నది డీఎంకే నేతల భావన.ఈ నేపథ్యంలో మోదీ పాంబన్ లో ఉంటే, సీఎం స్టాలిన్ ఊటీలో ఓ సభలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, “పునర్విభజనపై ప్రధాని ఓ స్పష్టమైన హామీ ఇవ్వాలి, అన్నారు.జనాభా నియంత్రణలో తమిళనాడు ముందంజలో ఉందని స్టాలిన్ చెప్పారు. ఇటువంటి రాష్ట్రాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య తగ్గకూడదు, కేంద్రం న్యాయం చేయాలి,” అని స్పష్టం చేశారు.ఈ అంశంపై ప్రధాని నుంచి స్పందన వచ్చే వరకు డీఎంకే పోరాటం కొనసాగుతుందని సూచనలున్నాయి. స్టాలిన్ గైర్హాజరు రాజకీయంగా ఉద్దేశపూర్వకమేనని అనేక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ MORE : Prabhas: జాట్ మూవీ టీమ్‌ని కలిసిన ప్రభాస్

DMKvsBJP MKStalin ModiVisitTamilNadu NarendraModi PambanBridge TamilNaduPolitics VerticalRailBridge

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.