हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AndhraPradesh :తప్పిపోయి 20 ఏళ్లకు కుటుంబ సభ్యుల వద్దకు

Anusha
AndhraPradesh :తప్పిపోయి 20 ఏళ్లకు కుటుంబ సభ్యుల వద్దకు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుక్కు కూలీపనుల కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గమధ్యంలో తప్పిపోయాడు. 22 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. బ్రతుకుతెరువు కోసం ఊరు విడిచి వెళ్లిన అతను, అదృష్టం తిరగబడి దశాబ్దాల పాటు వెట్టిచాకిరీలో చిక్కుకుపోయాడు. తమిళనాడులో కార్మిక శాఖ అధికారుల దాడుల వల్లే సుక్కు జీవితంలో మళ్లీ వెలుగు చూసాడు.పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొఱ్ఱె సుక్కు, ఉపాధి కోసం తన గ్రామంలోని మరికొందరితో కలిసి పాండిచ్చేరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు తమిళనాడులో ఓ స్టేషన్‌లో ఆగింది. టీ తాగేందుకు క్రిందకి దిగిన సుక్కు, తిరిగి వచ్చేసరికి రైలుఅప్పటికే వెళ్ళిపోయింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అతను ఎటు వెళ్లాలో పాలుపోకుండా అక్కడే ఉండిపోయాడు. రెండు రోజులు ఆకలితో తిరిగిన తర్వాత ఓ గొర్రెల కాపరి దగ్గర పనిచేయడం మొదలు పెట్టాడు.ఆ యజమాని మొదట్లో సహాయపడినట్లు కనిపించినా, అతన్ని బలవంతంగా తన వద్దే ఉంచుకున్నాడు. రోజూ కష్టపడినా, కూలీ లేకుండా పనిచేయించేవాడు. ఎక్కడికీ వెళ్లకుండా అతనిపై నిఘా ఉంచేవాడు. అలా 22 ఏళ్ల పాటు సుక్కు వెట్టిచాకిరీ చేస్తూ అక్కడే జీవితం గడిపాడు.

కార్మిక శాఖ అధికారులు

ఇటీవల శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుక్కు వారి కంటపడ్డాడు. అప్పుడు అధికారులు సుక్కు తో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియజేశాడు సుక్కు. వెంటనే తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు సుక్కు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ శ్యాం ప్రసాద్ పోలీసులకు ఫోటో అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించాడు. దీంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి సుక్కు ఫోటో చూయించి ఆరా తీయగా అలాంటి వారెవరు తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో సుక్కు ఆచూకీ కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోనే మరికొన్ని గ్రామాల్లో వెదకడం ప్రారంభించారు. సుక్కు ఆచూకి తెలిసిన వారు తమకు తెలియజేయాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అధికారులు.

apparao

22 ఏళ్ల తర్వాత

అప్పారావు అసలు పేరు కొండగొఱ్ఱె సుక్కు. ట్రైన్ దిగి తప్పిపోయిన తరువాత సుక్కు అనే పేరు మార్చుకుని అప్పారావు అని పెట్టుకున్నాడు. దీంతో అప్పారావు అని అంటే ఎవరు గుర్తు పట్టలేకపోయారు. అంతేకాకుండా 22 ఏళ్లు కావడంతో అతని పోలికలు కూడా మారిపోయాయి. దీంతో అతని ఆచూకి దొరకడం సవాలుగా మారింది. చివరికి జిల్లాలో పలువురు యువకులు కూడా అతని ఫోటో పట్టుకొని వెదకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతరావు టంకాల అనే యువకుడు కొండగొర్రే సుక్కు కుమార్తె పార్వతీపురం మండలం ములక్కాయవలసలో ఉందని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా అప్పారావు ఆచూకీ తెలుసుకొని ఎట్టకేలకు కుమార్తె కు అప్పారావును అందజేశారు. దీంతో అప్పారావు కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా 22 ఏళ్లు కూలీ లేకుండా పని చేయించుకున్న యజమాని వద్ద నుండి కూలీ డబ్బులు అందజేయడంతో అప్పారావు జీవనోపాధికి మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870